ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

భారతదేశంలో ఇంధన ధరలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి పెనుభారమవుతోంది. అంతే కాకుండా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణం కూడా కాలుష్యమవుతుంది. ఈ కారణంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని చెబుతున్నారు.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

ఇటీవల బీహార్ ప్రభుత్వం పర్యావరణ అనుకూలమైన 12 కొత్త లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలు కలుషిత వాయువులు విడుదల చేయవు, కావున ఇవి పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటాయన్నారు.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

పర్యావరణ అనుకూలతతో పాటు, సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం 12 కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీసు ప్రారంభించబడింది. వీటిలో రెండు బస్సులు పాట్నా-రాజ్‌గీర్ మార్గంలో, 2 ఎలక్ట్రిక్ బస్సులు పాట్నా-ముజఫర్‌పూర్ మార్గంలో నడుస్తాయి.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

మిగిలిన 8 ఎలక్ట్రిక్ బస్సులు పాట్నాలోని వివిధ మార్గాల్లో నడుస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడిపిన తరువాత, బీహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బస్సు అనుకోకుండా కుప్పకూలింది. కొంతమంది మంత్రులు మరియు చట్టసభ సభ్యులను అక్కడ వదిలివేసిన తరువాత బస్సు డ్రైవర్ అసెంబ్లీ సర్కిల్‌లో యు-టర్న్ తీసుకున్నప్పుడు బస్సు అనుకోకుండా క్రాష్ అయ్యింది.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

ఈ సంఘటన జరిగిన ప్రాంతం కొంత రద్దీగా ఉండటం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద సంఖ్యలో ఉపయోగించమని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఢిల్లీ, గుజరాత్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాయు కాలుష్య సమస్యను తగ్గించడానికి మరియు ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు సహా వివిధ ప్రయోజనాలను అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ ప్రభుత్వం ముందంజలో ఉంది.

ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా సిఎన్‌జి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తరువాత కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇవి పర్యావరణ అనుకూలంగా ఉండటం వల్ల భవిష్యత్ లో కూడా ఎటువంటి కాలుష్యాలు జరిగే అవకాశం లేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 3, 2021, 14:52 [IST]
English summary
Bihar CM Flags Off Low Floor Electric Buses. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+