Just In
- 11 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 13 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 13 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 15 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Movies Brahmamudi April 18th episode వెన్నెల నిజంగానే చనిపోయిందా? రాజ్ ఎందుకు అబద్దం చెప్పాడు?
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కరోనా నివారణ కోసం ఫస్ట్ డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ క్యాంప్ స్టార్ట్ చేసిన BMC
కరోనా వైరస్ భారతదేశంలో విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ ఈ రోజు పుట్టినది కాదు. మొట్టమొదట చైనా యొక్క వుహాన్ నగరంలో బయటపడింది. చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి ప్రపంచాన్నే తలకిందులు చేసింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది.
భారతదేశంలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కోపోతున్నారు. అంతే కాకుండా ఎంతోమంది ప్రజలు ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. ఈ వైరస్ నివారించడానికి ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వీటిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రచారం చేపట్టారు.
నివేదికల ప్రకారం దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ముంబైకి చెందిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) తన మొదటి డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ ప్రచారాన్ని ముంబై నగరంలో ప్రారంభించింది.
MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?
ఈ డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ ప్రచారంలో ప్రచారకులు మరియు సీనియర్ సిటిజన్లు తమ వాహనాల్లోకి వెళ్లి కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన ప్రచారం ద్వారా బీఎంసీ దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. నివేదికల ప్రకారం, దాదర్ వెస్ట్లోని శివాజీ పార్కు సమీపంలో జెకె సావంత్ రోడ్లోని కోహినూర్ పబ్లిక్ పార్కింగ్ స్థలంలో డ్రైవ్-ఇన్ టీకా ప్రచారం ప్రారంభించబడింది.
ఈ ప్రచారాన్ని ప్రారంభించిన తరువాత ఉదయం 10 గంటలకు లబ్ధిదారుడి కారులో మొదటి వ్యాక్సిన్ ఇవ్వబడింది. ఈ ప్రచారం గురించి బిఎమ్డబ్ల్యూ వార్డ్-జిఎన్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘవ్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం
ఈ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్-ఇన్ ప్రచారాన్ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇందులో 45 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి, ముఖ్యంగా వయసు ఎక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లకు ఈ టీకా ఇవ్వబడుతుంది.
ఈ ప్రచారం కోసం ఏడు బూత్లు నిర్మించబడ్డాయి. వీటిలో రెండు డ్రైవ్-ఇన్ బూత్లుగా ఉపయోగించబడతాయి. ఈ ఏడు బూత్లకు రోజుకు 5,000 మంది లబ్ధిదారులకు టీకాలు వేసుకునే అవకాశం కల్పించబడుతుందని దిఘవ్కర్ తెలిపారు.
MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?
ఈ పార్కింగ్ డ్రైవ్లో 70 వాహనాలు ప్రయాణిస్తాయి. ఎక్కువమంది ప్రజలు రెండు డ్రైవ్-ఇన్ బూత్లలో వరుసలో వేచి ఉన్నారు. అంతే కాకుండా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ డ్రైవ్-ఇన్ బూత్ల వద్ద రిజిస్ట్రేషన్ స్టాల్స్ కూడా ఏర్పాటుచేయబడ్డాయి. వీటిని ఉపయోగించి వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు వ్యాక్సిన్ పొందవచ్చు.
ఈ ప్రచారంలో పాల్గొన్న దాదాపు అందరికి కూడా వ్యాక్సిన్ అందుతోంది. ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
45 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ ప్రచారాన్ని దాదర్ వెస్ట్ లోని కోహినూర్ పబ్లిక్ పార్కింగ్ లాట్ జెకె సావంత్ మార్గ్ వద్ద ప్రారంభించారు. అందరికీ #టీకా అని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఈ పోస్ట్లో పేర్కొంది.
జనవరి 16 న భారతదేశంలో వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుండి, బిఎంసి ముంబై అంతటా 135 కి పైగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ పొందాలనుకునే వారు వ్యాక్సిన్ పొందవచ్చు. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రచార కేంద్రాలను దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?