అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్
కరోనా మహమ్మారి అధికంగా వ్యాపిస్తున్న సమయంలో భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మహారాష్ట్ర గవర్నమెంట్ అత్యవసర సమయాల్లో అవసరమైన వాహనాలను దృష్టిలో ఉంచుకుని కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ను ఇటీవల ముంబైలో ప్రవేశపెట్టింది.

అయితే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కలర్ కోడెడ్ సిస్టం ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనికి ప్రధాన కారణం ఈ-పాస్ విధానం అమలులోకి రావడం. ఈ కారణంగా ముంబైలో కలర్ కోడెడ్ సిస్టం తొలగించి ఈ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కరోనా అధికంగా వ్యాపిస్తున్న సమయంలో అతయవసర సమయంలో ఈ 'ఈ-పాస్' చాలా అవసరం, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అనవసరంగా రోడ్డుపై తిరిగే వాహనాల సంఖ్యని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ-పాస్ వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చింది. ఈ కఠినమైన పరిస్థితిలో నగరం నుంచి అత్యవసరం బయటకి వెళ్లాలనుకునే వాహనదారులు తప్పకుండా ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది.

దీని గురించి ఒక అధికారి మాట్లాడుతూ, మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలర్ కోడెడ్ స్టిక్కర్ వ్యవస్థను నిలిపివేసే నిర్ణయం శుక్రవారం తీసుకోబడింది. కావున గత రాత్రి దీనికోసం ఉత్తర్వులు జారీ కూడా చేయబడ్డాయి. కావున వాహనదారులు దీనిని గమనించాలి అని తెలిపారు.

ముంబైలో కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ను గత వారంలోనే ప్రవేశపెట్టారు. అయితే అంతలోనే దీనిని తొలగిస్తో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ కలర్ కోడెడ్ నియమం ప్రకారం ఆరోగ్య సంబంధిత నిపుణులు, వైద్యులు, వైద్య సిబ్బంది, అంబులెన్సులు, వైద్య పరికరాల సరఫరాదారులు ఉపయోగించే వాహనాలకు రెడ్ స్టిక్కర్లు ఇవ్వబడతాయి.
ఆహారం, కూరగాయలు, పండ్లు, కిరాణా, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల రవాణాలో పాల్గొనే వాహనాలు గ్రీన్ స్టిక్కర్స్ ఇవ్వబడతాయి.

చివరగా నిత్యావసర సేవలు, విద్యుత్ మరియు టెలికాం విభాగం సిబ్బంది, ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లేదా బిఎంసి అధికారుల వాహనాలకు మరియు మీడియా సభ్యులు వాహనాలకు ఆరంజ్ కలర్ స్టిక్కర్లు ఇవ్వబడతాయి.

కలర్ కోడెడ్ విధానాన్ని నిలిపివేసినట్లు ముంబైలోని అన్ని పోలీసు అధికారులకు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీని కారణంగానే సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో సెక్షన్ 144 ను విధించింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇప్పుడు కరోనా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఢిల్లీలో లాక్ డౌన్ ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఇక్కడ విధించిన కొత్త నిబంధనల ప్రకారం మెట్రోలో సగం మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించడానికి అనుమతించబడింది.

ఈ సమయంలో గవర్నమెంట్ బస్సులు, ఆటోలు, ఈ-రిక్షాలు నడుస్తాయి. ఇందులో కూడా 50 శాతం మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతించబడుతుంది. క్యాబ్, టాక్సీ వంటి సర్వీసులు కూడా ప్రస్తుతం అమలులో ఉన్నాయి, అయితే తప్పకుండా నియమాలను పాటించాలి. ఈ సమయంలో ఈ-పాస్ పొందాలనుకునే వారు www.delhi.gov.in వెబ్ సైట్ సందర్శించి పొందవచ్చు.

అయితే దేశవ్యాప్తంగా కరోనా అధికమవుతున్న సందర్భంలో ప్రజలు కూడా ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ కఠినమైన నియమాలను పాటించినప్పుడు మాత్రమే కరోనా మహమ్మారిని కొంతవరకు తగ్గించవచ్చు. కావున ఇప్పుడు అధికంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది, కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
Image Courtesy: Mumbai Police


Click it and Unblock the Notifications








