Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశలోని అనేక రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉంది. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో, దేశంలో సిఎన్జి వాహనాలపై ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగుతున్నప్పటికీ, సిఎన్జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ధరలు మాత్రం పెరగడం లేదు. పెట్రోల్ ధరతో పోల్చుకుంటే, సిఎన్జి ధర చాలా తక్కువగా ఉంటుంది.
అంతేకాదు, పెట్రోల్తో నడిచే కార్లతో పోల్చి చూస్తే, సిఎన్జి గ్యాస్తో నడిచే కార్లు అత్యధిక మైలేజీని కూడా అందిస్తాయి. ఈ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్న కస్టమర్లు ఇప్పుడు సిఎన్జి కార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సిఎన్జి వెర్షన్ కార్లకు ఎక్కడిలేని డిమాండ్ వచ్చి పడింది.
తాజాగా మారుతి సుజుకి విడుదల చేసిన నివేదికల ప్రకారం, గతంలో కంటే 2020-21లోనే ఎక్కువగా సిఎన్జి కార్లు అమ్ముడయ్యాయి. మనదేశంలో మారుతి సుజుకి సంస్థ నుండే అత్యధికంగా సిఎన్జి కార్లు అమ్ముడవుతున్నాయి.
మారుతి సుజుకి గడచిన 2019-2020 కాలంలో 1,06,444 సిఎన్జి కార్లను విక్రయించగా, 2020-2021 కాలంలో 1,57,954 యూనిట్ల సిఎన్జి వాహనాలను విక్రయించింది. మారుతి సుజుకి ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడు నెలల్లోనే అత్యధిక సిఎన్జి కార్లను విక్రయించింది.
దీన్నిబట్టి చూస్తుంటే, సిఎన్జి కార్ల ట్రెండ్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో హ్యుందాయ్, టాటా మోటార్స్ మరియు మారుతి సుజుకి వంటి సంస్థలు సిఎన్జి ఆధారిత వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిలో, మారుతి సుజుకి నుండే అత్యధికంగా సిఎన్జి కార్లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి అందిస్తున్న సిఎన్జి మోడళ్లలో ఆల్టో, ఎస్ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఈకో మరియు సెలెరియో కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్తో పాటుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కిట్తో కూడా లభిస్తున్నాయి. వీటికి అదనంగా మరిన్ని కొత్త సిఎన్జి మోడళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని రకాల సిఎన్జి కార్లు లభిస్తున్నాయి. - వాటికి సంబంధించిన వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.