Just In
- 16 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Movies Brahmamudi April 26th episode: నా కూతురుకు అడ్డుకొనే పరిస్థితి రానివ్వను.. కనకం ఫైర్
- News ఈసారి అక్షయ తృతీయ నాడే బోలెడు శుభయోగాలు.. ఇలా చేసినవారికి ధనయోగం
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే మీకే నష్టం..!
భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిన సంగతి మనం గమనిస్తూనే ఉన్నాయి. కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలోనే కాకుండా, త్రీవీలర్ మరియు ఫోర్-వీలర్ విభాగంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది. ఓవైపు దేశంలో నిరంతరాయంగా పెరిగిపోతున్న ఇంధన ధరలు మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కారణంగా వీటి వినియోగం భారీగా పెరిగింది.
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీల వలన వాటి ధరలు కూడా తక్కువగా ఉంటున్నాయి. అయితే, ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండబోదని తెలుస్తోంది. వచ్చే ఏడాది నుండి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని తొలగించడం మరోవైపు బ్యాటరీల ధరలు కూడా పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ బ్లూంబర్గ్ఎన్ఈఎఫ్ వెల్లడించిన దాని వార్షిక బ్యాటరీ నివేదిక ప్రకారం, గత సంవత్సరం kWh కి సగటు ధర 140 డాలర్లు ఉంటే, అది ప్రస్తుతం 132 డాలర్లకు తగ్గింది. అదే 2010 సంవత్సరంతో పోలిస్తే, ఇది 1,200 డాలర్లను భారీగా తగ్గి 132 డాలర్లకి చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగించే బ్యాటరీలను తయారు చేయడానికి సగటున kWh సుమారు 118 డాలర్లు ఖర్చు అవుతుంది. ఈ నివేదిక ఆశాజనకంగా ఉన్నప్పటికీ, బ్యాటరీలలో ఉపయోగించే ముడిసరుకుల పెరుగుదల కారణంగా, వచ్చే ఏడాది వీటి తయారు భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో లిథియం ధరలు పెరగడం మరియు ముడిసరుకు ధరలు పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో, 2022 లో బ్యాటరీలు మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రధానమైన భాగం బ్యాటరీ, ఇది సదరు వాహన ధరలో దాదాపు సగం వరకూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా అందులో వినియోగించే బ్యాటరీ సామర్థ్యాలను బట్టి ఉంటాయి. వాటి ధరను ఎలా నిర్ణయించబడుతుందనే దానిలో బ్యాటరీ ధర కీలకమైన భాగం కాబట్టి, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా మరింత పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుత సంవత్సరం (2021లో) ఆరంభంలో మొత్తం బ్యాటరీ ధరలు తగ్గినప్పటికీ, ద్వితీయార్థంలో మాత్రం ధరల పెరుగుదల కనిపించిందని బిఎన్ఈడి నివేదిక యొక్క ప్రధాన రచయిత జేమ్స్ ఫ్రిత్ తెలిపారు. ఇది వాహన తయారీదారులకు, ప్రత్యేకించి యూరప్లోని వారికి కఠినమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, సగటు ఫ్లీట్ ఉద్గారాల ప్రమాణాలకు అనుగుణంగా ఈవీల అమ్మకాలను పెంచాలని ఆయన చెప్పారు.
మరి ఈ రాబోయే పరిస్థితులను ఆటోమొబైల్ కంపెనీలు ఎలా ఎదుర్కుంటాయో మరియు ధరల పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి. సాధ్యమైనంత వరకూ ఆటోమొబైల్ బ్రాండ్లు ధరల పెరుగుదలనే ఎంచుకునే ఆస్కారం ఉంది. లాభాల మార్జిన్లలో కోత విధించడం లేదా దానిని వినియోగదారుల పైకి బదిలీ చేయడం చేయవచ్చు. అదే గనుక జరిగితే, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు దగ్గరవుతున్న కస్టమర్లు తిరిగి వాటికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా టెస్లా, మెర్సిడెస్, ఫోక్స్వ్యాగన్, రెనాల్ట్, టొయోటా, హ్యుందాయ్, జనరల్ మోటార్స్ మరియు నిస్సాన్ వంటి గణనీయమైన సంఖ్యలో ఆటోమొబైల్ బ్రాండ్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయంలో తమ లక్ష్యాలను మరియు ఆశయాలను స్పష్టంగా తెలియజేసాయి. కానీ, ఈవీ సెగ్మెంట్లో కోత పెట్టడం వల్ల, ధర పరిధి కాకుండా, సంభావ్య కొనుగోలుదారుల మనస్సులలో సున్నితమైన అంశంగా మిగిలిపోతుందని చాలామంది భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీల ధర కూడా వాహనాల ధరపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, సంభావ్య కస్టమర్లు ఈ వాహనాల శ్రేణి మరియు ఛార్జింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోకుండా వెనుకంజ వేస్తున్నప్పుడు, ధరల పెంపు తర్వాత వారు ఎలక్ట్రిక్ వాహనాలకు మారతారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
రూ. 60,000 లకే Greta Electric Scooter..
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి తాజాగా మరొక కొత్త బ్రాండ్ ప్రవేశించింది. గుజరాత్కు చెందిన గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Greta Electric Scooters) దేశీయ మార్కెట్లో నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. వీటిలో హార్పర్ (Harper), హార్పర్ జెడ్ఎక్స్ (Harper ZX), ఇ-వెస్పా (Evespa) మరియు గ్లైడ్ (Glide) అనే మోడళ్లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 60,000 నుండి మొదలై రూ. 92,000 వరకు ఉన్నాయి.
గ్రెటా ఎలక్ట్రిక్ ఈ నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను 48 వోల్ట్ లేదా 60 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 70 కి.మీ నుండి 100 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే ఈ బ్యాటరీలను సన్నా నుండి వంద శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు మరియు కస్టమర్ల అవసరాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం వంటి ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది.