Just In
- 55 min ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 2 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 15 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 19 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ.. షాక్లో అరబ్ దేశాలు
భారతదేశంలో రోజురోజుకి వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. వాహనాలు అధికంగా పెరిగిన కారణంగా వాటికి కావాల్సినంత ఇంధనం సమకూర్చలేకపోతున్నారు. ఈ తరుణంలో ఇంధన అవసరాల కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.
దీని వల్ల మనం ఇతర దేశాలనుంచి దాదాపు 85 శాతం ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇథనాల్ను పెట్రోల్లో కలిపే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త ఇథనాల్ పథకానికి మోడీ ప్రభుత్వం ఒక కొత్త లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు 20 శాతం ఇథనాల్ను పెట్రోల్లో కలిపే పధకానికి 2023 ను లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఈ విధంగా అధిక మొత్తంలో ముడి చమురు దిగుమతి, దేశ ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఇంధనంలో స్వయం సమృద్ధిని పెంచడానికి ప్రభుత్వం ఇథనాల్ పథకాన్ని నడుపుతోంది.
MOST READ:మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
జాతీయ జీవ ఇంధన విధానం 2018 ప్రకారం, 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం దేశంలో జీవ ఇంధన ఉత్పత్తిని రికార్డు స్థాయికి పెంచే వ్యూహం రూపొందించారు. గతేడాది ప్రభుత్వం 2022 నాటికి 10 శాతం బ్లెండింగ్ పూర్తి చేసి 2030 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ ఆ లక్ష్యాన్ని ఆ తరువాత 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ గడువుని మరింత తగ్గిస్తూ 2023 కు చేర్చారు. దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్తో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను విక్రయించాలని అన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
MOST READ:మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నిబంధనలు 2023 ఏప్రిల్ 01 నుండి అమల్లోకి రానుంది. ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.
అక్టోబర్లో ప్రారంభమైన ప్రస్తుత ఇథనాల్ సరఫరా, సంవత్సరానికి పెట్రోల్లో ఇథనాల్ను 10 శాతం కలపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 10 శాతం బ్లెండింగ్ రేటును సాధించడానికి కనీసం 4 బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరం. అదే సమయంలో, 2023 లో 20 శాతం బ్లెండింగ్ సాధించడానికి 10 బిలియన్ లీటర్ల అవసరం.
ఇథనాల్ ఉత్పత్తి కోసం, చక్కెర పరిశ్రమ 6 మిలియన్ టన్నుల మిగులు చక్కెరను 7 బిలియన్ టన్నుల ఇథనాల్ ఉత్పత్తి చేయబోతోంది, మిగిలినవి ధాన్యం ఉత్పత్తికి ఉపయోగించబడతాయి. ఇథనాల్ వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి నష్టం ఉండదు.
MOST READ:మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్; ఇందులో విజేత ఎవరంటే?
ప్రస్తుతం, పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ 2008 నుండి భారతదేశంలో అనుమతించబడింది. అయినప్పటికీ, లభ్యత లేకపోవడం వల్ల 6 శాతం కన్నా తక్కువ ఇథనాల్ పెట్రోల్తో కలుపుతున్నారు. అయితే 2008 కంటే ముందు పెట్రోల్లో కేవలం 4.22 శాతం ఇథనాల్ మాత్రమే కలిపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
వెహికల్ ఇంజిన్ కోసం వినియోగదారులకు 100% పెట్రోల్ మరియు ఇథనాల్ కలిపిన మిశ్రమం లభిస్తుందని గడ్కరీ గత సంవత్సరం తెలియజేసింది. చెరకు రైతులు కూడా ఇథనాల్ గ్యాస్ స్టేషన్ నుండి లబ్ది పొందుతారు. భారతదేశంలో కూడా ఇథనాల్ గ్యాస్ స్టేషన్ నిర్మించబడుతుంది. ప్రస్తుతం దీనిని రేసింగ్ విమానాలకు కూడా ఉపయోగిస్తున్నారు.
MOST READ:తండ్రికి నచ్చిన బైక్ గిఫ్ట్గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్
ఇథనాల్ ఒక రకమైన ఆల్కహాల్, దీనిని పెట్రోల్తో కలిపి వాహనాల్లో ఉపయోగించే ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. ఇథనాల్ ప్రధానంగా చెరకు పంట నుండి ఉత్పత్తి అవుతుంది. అంతే కాకుండా దీనిని అనేక ఇతర చక్కెర పంటల నుండి కూడా తయారు చేయవచ్చు.
ఇథనాల్ అనేది వ్యవసాయం మరియు పర్యావరణం రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా వరకు ఆర్థిక లోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మన దేశానికి కావలసిన ఇంధనం ఇతర దేశాల నుంచి ఎక్కువ స్థాయిలో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.