Just In
- 10 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 14 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 16 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 19 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు
ఒక వైపు దేశం మొత్తం కరోనా కోరల్లో నలుగుతున్నవేళ, మరోవైపు ఆటోమొబైల్ ప్రపంచంలో ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. నివేదికల ప్రకారం, ప్రముఖ వాహన తయారీ దిగ్గజం అయిన 'మారుతి సుజుకి ఇండియా' యొక్క మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) జగదీష్ ఖత్తర్ కన్నుమూసారు.
78 సంవత్సరాల జగదీష్ ఖత్తర్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఖత్తర్ 1993 నుంచి 2007 వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి, 2007 లో పదవీ విరమణ చేశారు. తరువాత మారుతి సుజుకి ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగారు.
జగదీష్ ఖత్తర్ 1993 లో మారుతి సుజుకి ఇండియాలో మార్కెటింగ్ డైరెక్టర్గా తన ఉన్నతిని ప్రారంభించి, 1999 సంవత్సరంలో పదోన్నతి పొంది, మారుతి సుజుకి ఇండియా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. జగదీష్ ఖత్తర్ను మొదట కేంద్ర ప్రభుత్వం, తరువాత సుజుకి మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) 2002 లో నామినేట్ చేసింది.
MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్డౌన్
మారుతి సుజుకి కంపెనీలో పనిచేయడానికి ముందు, అతను ఐఎఎస్ అధికారి. ఐ.ఎ.ఎస్ గా ఉన్న కాలంలో ఆయన ఉత్తర స్టీల్ డిపార్ట్మెంట్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీతో సహా పలు పదవులను నిర్వహించారు.
అతను 2007 లో మారుతి సుజుకి నుండి రిటైర్ అయిన తరువాత, అతను కార్నేషన్ ఆటో కంపెనీని స్థాపించాడు. కార్నేషన్ అనేది మల్టిపుల్-బ్రాండ్ కార్ల అమ్మకాలు మరియు సేవా సంస్థ. తరువాత కాలంలో దీనిని 2018 సంవత్సరంలో మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సొంతం చేసుకుంది.
MOST READ:కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు
లోన్ కి సంబంధించిన ఆరోపణలపై 2019 డిసెంబర్లో ఖత్తర్ను కూడా సిబిఐ ఆరోపించింది. జగదీష్ ఖత్తర్ యొక్క కార్నేషన్ ఆటో తన సోదరి పనుల కోసం రుణ మొత్తాన్ని మళ్లించిందని, దీనివల్ల 110 కోట్ల రూపాయల నష్టం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) కు ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది.
మారుతి సుజుకి అధ్యక్షుడు ఆర్.సి.భార్గవ, జగదీష్ ఖత్తర్ మరణానికి సంతాపం తెలుపుతూ, "ఇది మాకు చాలావరకు వ్యక్తిగత నష్టం. అంతే కాకుండా ఇది ఒక్కసారిగా జీర్ణించుకోలేని విషయం. జగదీష్ ఖత్తర్ తో మేము చాలా సంవత్సరాలు కలిసి పనిచేశాము. అతను మారుతికి ఒక మూలస్తంభం వంటి వ్యక్తి అన్నారు.
MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటి, మారుతి సుజుకి యొక్క వాహనాలకు ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాదు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ప్రతిష్ట ఉంది. ఇటీవల కాలంలోనే మలేసియాలో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ విడుదలైంది. మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.