Just In
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 19 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?
భారత ఆటోమొబైల్ తయారీదారులకు షాకిచ్చే విషయాన్ని చెప్పనుంది సర్కార్. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని, భారత రోడ్లపై తిరిగే కార్లలో తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కార్ల తయారీ సంస్థలను ఆదేశించే అవకాశం ఉంది.
ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ తరహా ఇంజన్లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించినందున, వచ్చే 8-10 రోజుల్లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ చర్య రైతులకు సహాయపడుతుందని, భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని గడ్కరీ చెప్పారు.
అసలు ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ అంటే ఏమిటి?
పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా పూర్తిగా 100 శాతం బయో-ఇథనాల్ (జీవ ఇంధన)తో నడిచే ఇంజన్ను ఫ్లెక్-ఫ్యూయెల్ ఇంజన్ అంటారు. అంటే, ఇది పూర్తిగా పెట్రోల్తో అయినా పనిచేస్తుంది లేదా పూర్తిగా జీవ ఇంధనంతోనైనా పనిచేస్తుంది. బ్రెజిల్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.
పెట్రోల్కి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఇథనాల్ ధర లీటరుకు రూ.60-62 వరకూ ఉంటుంది. కాగా, ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు చాలా ప్రాంతాల్లో లీటరుకు రూ.100 కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ల వినియోగం కస్టమర్లకు ఎంతో మేలు చేస్తుందని రోటరీ జిల్లా సదస్సు 2020-21లో ప్రసంగించిన నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
ఇథనాల్ ఇంధనాన్ని వాడటం ద్వారా భారతీయులు లీటరుకు 30-35 రూపాయలు ఆదా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను రవాణా శాఖ మంత్రిని, ఇకపై పెట్రోల్ ఇంజన్లు మాత్రమే ఉండవు, ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లు కూడా ఉంటాయని నేను పరిశ్రమకు ఆదేశాలు జారీ చేయబోతున్నాను" అని అన్నారు.
"ఈ ఇంజన్ల వలన వినియోగదారులు 100 శాతం ముడి చమురు లేదా 100 శాతం ఇథనాల్ వాడకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ తయారీదారులు బ్రెజిల్, కెనడా మరియు అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను ఉత్పత్తి చేస్తున్నారు" అని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి గడ్కరీ పేర్కొన్నారు.
భారతదేశంలో ఈ ఫ్లెక్స్-ఫ్యూయెల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే, సదరు ఇంజన్లు కలిగిన వాహనాలను ఉపయోగించే వినియోగదారులు తమ ఎంపిక మేరకు పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా 100 శాతం బయో ఇథనాల్ను వాడే అవకాశాన్ని పొందవచ్చు.
వాహనాల్లో బయో ఇథనాల్ను ఉపయోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా మరియు ముడి చమురు దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. పెట్రోల్తో 20 శాతం ఇథనాల్-బ్లెండింగ్ సాధించే లక్ష్యం యొక్క తేదీని ఐదేళ్ల వరకు (2025 వరకు) పొడిగించామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు.
వచ్చే 2022 నాటికి పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ను మరియు 2030 నాటికి 20 శాతం డోపింగ్ కలపాలని ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. గడచిన 2014లో పెట్రోల్లో 1-1.5 శాతం ఇథనాల్ను కలుపుతుండగా, ప్రస్తుతం అది 8.5 శాతానికి పెరిగిందని, ఫలితంగా ఇథనాల్ సేకరణ 38 కోట్ల లీటర్ల నుండి 320 కోట్ల లీటర్లకు పెరిగిందని గడ్కరీ చెప్పారు.