మహీంద్రా లాజిస్టిక్స్తో చేతులు కలిపిన ఫ్లిప్కార్ట్; ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా డెలివరీలు!
ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ ఫ్లిప్కార్ట్ లాస్ట్ మైల్ డెలివరీ సేవల కోసం మహీంద్రా లాజిస్టిక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా, ఫ్లిప్కార్ట్ తమ డెలివరీ సేవల కోసం మహీంద్రా ఈడెల్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనుంది.
మహీంద్రా లాజిస్టిక్స్ తన ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీస్ ఈడెల్ను గత ఏడాది దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ప్రారంభించింది. ఈ సేవల కోసం మహీంద్రా ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. మహీంద్రా ఈడెల్ దేశంలోని పలు ఇ-కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలను అందిస్తుంది.

ఫ్లిప్కార్ట్ సంస్థ వచ్చే 2030 నాటికి తన డెలివరీ వాహనాలన్నింటినీ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్కార్ట్ ఇందుకోసం సుమారు 25,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనుంది. మహీంద్రా ఈడెల్ సహాయంతో, ఫ్లిప్కార్ట్ ఇప్పుడు తమ డెలివరీ భాగస్వాములకు ఎలక్ట్రిక్ ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహనాలను అందించడం ప్రారంభించింది.

లాస్ట్ మైల్ డెలివరీ సేవలలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం వలన ఖర్చులు తగ్గుతాయని, అంతేకాకుండా వాహన మరియు వాయు కాలుష్యాన్ని కూడా నివారించవచ్చని ఫ్లిప్కార్ట్ తెలిపింది. భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అవుతుందని కంపెనీ నమ్ముతోంది, కాబట్టి ఇందుకు తగినట్లుగా ఫ్లిప్కార్ట్ సిద్ధమవుతోంది.

మహీంద్రా లాజిస్టిక్స్ ఈడెల్ డెలివరీ సేవల కోసం ప్రత్యేకమైన ఛార్జింగ్ స్టేషన్లు, వెహికల్ ట్రాకింగ్, రిపేర్ మరియు బ్యాటరీ ఎక్సేంజ్ స్టేషన్లను కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, కోల్కతా మరియు హైదరాబాద్లోని ఆరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 20 నగరాలకు మహీంద్రా ఈడెల్ సేవలను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ఈ సేవలను అందిస్తుంది. ఈ-కామర్స్, డెలివరీ మరియు నిత్యావసర వస్తువుల సరఫరా రంగంలో ఈడెల్ సేవలను అందిస్తుంది.
మహీంద్రా ఎడెల్ ఎలక్ట్రిక్ వాహనాలలో డెలివరీ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు, లాంగ్ రేంజ్ బ్యాటరీలు ఉంటాయి. ఈ వాహనాలను ఛార్జ్ చేయడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ను కూడా నిర్మిస్తున్నారు.

ఎలక్ట్రిక్ కార్ల తయారీతో పాటుగా వాణిజ్య వాహన రంగంలో కూడా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, ఫోర్ వీలర్ల అభివృద్ధిపై మహీంద్రా దృష్టి సారించింది. ఇటీవలే, మహీంద్రా తమ చిన్న ఎలక్ట్రిక్ కారు కూడా భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








