తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మరియు భారత యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రాలు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడేందుకు గడచిన 2019 సంవత్సరంలో ఇరు కంపెనీలు ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఆశ్చర్యకరంగా ఈ జాయింట్ వెంచర్ నుండి తప్పుకుంటున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

భారతదేశంలో తమ కార్యకలాపాలను స్వతహాగా నిర్వహించడం కొనసాగిస్తామని ఫోర్డ్ పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్రా మరియు ఫోర్డ్ ఇండియా కంపెనీలు అక్టోబర్ 1, 2019 తేదీన తమ జాయింట్ వెంచర్ ప్లాన్‌ను ప్రకటించాయి. రెండు బ్రాండ్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఫోర్డ్ ఇండియా భవిష్యత్తులో భారత మార్కెట్ కోసం తీసుకురానున్న మోడళ్లలో ఉపయోగించే అండర్‌పిన్నింగ్స్‌ను (ప్లాట్‌ఫామ్)ను మహీంద్రా నుండి తీసుకోనుంది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అయితే, ఇప్పుడు జాయింట్ వెంచర్ పేపర్ల దశలోనే ఆగిపోయింది. జేవీ నుండి తప్పుకుంటున్నట్లు ఫోర్డ్ ఇండియా డిసెంబర్ 31, 2020 తేదీ సాయంత్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కారణాన్ని ఫోర్డ్ వెల్లడించకపోయినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్ల కారణంగానే ఇరు కంపెనీలు జాయింట్ వెంచర్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

మహమ్మారి కారణంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులును దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ మరియు మహీంద్రా కంపెనీలు తమ మూలధన కేటాయింపు ప్రాధాన్యతలను తిరిగి అంచనా వేసుకోవలసి ఉందని ఫోర్డ్ తన ప్రకటనలో పేర్కొంది. జాయింట్ వెంచర్ గురించి ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకోవడంలో తుది నిర్ణయం తీసుకోవటానికి ఇరు కంపెనీలకు డిసెంబర్ 31, 2020 తేదీ వరకు గడువు ఉందని ప్రకటన గుర్తు చేసింది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అయితే, అక్టోబర్ 2019 నుండి వచ్చిన ఆర్థిక మార్పులను చూస్తే, రెండు కంపెనీలు ఒప్పందాన్ని పూర్తిగా ముగించడానికి బదులుగా, జాయింట్ వెంచర్‌ను విరమించుకోవాలని ఎంచుకున్నాయి.

MOST READ:క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న ఎంజి జెడ్‌ఎస్ పెట్రోల్ : పూర్తి వివరాలు

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అక్టోబర్ 2019లో ఇరు కంపెనీలు ప్రకటించిన జాయింట్ వెంచర్ ప్రకారం, భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ మహీంద్రా నియంత్రించాల్సి ఉంటుంది. ఇందులో ప్రొడక్షన్, సేల్స్ సహా ఇతర కార్యకలాపాలు ఉన్నాయి. జాయింట్ వెంచర్ ప్రారంభంలో రెండు సంస్థలూ తగిన వనరులను సమకూర్చడానికి మరియు కొత్త ఉత్పత్తులు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను వేసుకున్నాయి.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

కాగా, ఇప్పుడు జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ ఇండియా విరమించుకోవడంతో, భారతదేశంలో స్వతంత్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని అమెరికన్ బ్రాండ్ పేర్కొంది. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలను చురుకుగా అంచనా వేస్తున్నామని, దాని ఆధారంగా ఎంపికలు చేసి, మూలధనాన్ని కేటాయిస్తామని ఫోర్డ్ తమ ప్రకటనలో పేర్కొంది.

MOST READ:ఇక బ్యాటరీ చార్జింగ్ సమస్యే ఉండదు; కొత్తగా 500, రెండేళ్లలో 10,000 చార్జింగ్ స్టేషన్లు

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

ఫోర్డ్-మహీంద్రా కంపెనీల మధ్య కుదిరిన జాయింట్ వెంచర్ నుండి భారత మార్కెట్లో ఇరు బ్రాండ్ల నుండి అనేక కొత్త ఉత్పత్తులు వస్తాయని అందరూ భావించారు. వీటిలో నెక్స్ట్-జెనరేషన్ ఎకోస్పోర్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీ కూడా ఉన్నాయి. వాస్తవానికి, ఫోర్డ్-మహీంద్రా జేవీ నుండి రాబోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీ చిత్రం కూడా గతంలో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

జేవీలో భాగంగా, మహీంద్రా-ఫోర్డ్ కంపెనీల నుండి భారత మార్కెట్ కోసం అనేక మోడళ్లను ప్లాన్ చేసినప్పటికీ, అన్నింటి కన్నా ముందుగా మహీంద్రా ప్లాట్‌ఫామ్‌ను పంచుకోనున్న మొదటి ఫోర్డ్ ఉత్పత్తిగా సరికొత్త సి-ఎస్‌యూవీ (మిడ్-సైజ్ ఎస్‌యూవీ)ని ప్లాన్ చేశారు.

MOST READ:రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న అజారుద్దీన్ కారు ; తృటిలో తప్పిన ప్రమాదం

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీని మహీంద్రా నుండి రాబోయే కొత్త తరం 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు మొత్తం జేవీని పూర్తిగా నిలిపివేయడంతో, పైన పేర్కొన్న ఉత్పత్తులన్నీ కూడా నిలిచిపోనున్నాయి. కాగా, జాయింట్ వెంచర్ విషయంపై మహీంద్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Most Read Articles

Read more on: #ఫోర్డ్
English summary
Ford India Exits From Proposed Ford-Mahindra Joint Venture. Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X