Just In
- 18 min ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 1 hr ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 3 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Movies Tillu Square Business: సిద్దు మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోలతో సమానంగా.. టిల్లు 2 హిట్ కావాలంటే!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇక తప్పనిసరే.. పొడగింపులు ఉండవ్..: ఫాస్టాగ్పై నితిన్ గడ్కరీ స్టేట్మెంట్
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల గుండా ప్రయాణించే వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలని గత కొంత కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసినదే. కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఫాస్టాగ్ తప్పనిసరి నిబంధనల్లో కొన్నిసార్లు సడలింపులు ఇస్తూ వచ్చారు.
అయితే, ఇకపై ఈ విషయంలో ఎలాంటి పొడగింపులు ఉండబోవని, తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఫాస్టాగ్ నిబంధనలను పాటించాలని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూలు కోసం ఫాస్టాగ్ వ్యవస్థను 100 శాతం అమలు చేయడానికి గడువును పొడిగించే ప్రతిపాదన లేదని నితిన్ గడ్కరీ తెలిపారు.
వాస్తవానికి ఇదివరకటి నిబంధనల ప్రకారం, జనవరి 1, 2021వ తేదీ నుండి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల గుండా వెళ్లే అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలి. అయితే, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరి 15 వరకూ పొడగించారు.
ఇక ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి పొడగింపులు ఉండవని గడ్కరీ స్పష్టం చేశారు. ఈ గడువు తేదీ లోపుగా వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ వాహనాలకు ఫాస్టాగ్ను జోడించుకోవాలని సూచించారు.
గత 2019 డిసెంబర్లో 44.31 శాతంగా ఉన్న ఫాస్టాగ్ వసూళ్లు గడచిన 2020 డిసెంబర్లో 73.36 శాతానికి పెరిగాయని గడ్కరీ వివరించారు. డిసెంబర్ 2020 నెలలో ఫాస్టాగ్ ద్వారా వసూలు చేసిన నెలవారీ ఫీజు మొత్తం రూ.2,088.26 కోట్లుగా నమోదైందని ఆయన అన్నారు.
ఒక్క తమిళనాడులో రాష్ట్రంలోనే జనవరి 12 వరకు మొత్తం 18,64,115 ఫాస్ట్ ట్యాగ్లు జారీ చేయబడ్డాయి. ఈ చొరవ వల ఫాస్టాగ్ దారుల్లో నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గిందని, ఈ వ్యవస్థ మరింత కార్యాచరణలోకి రావడంతో ఇది మరింత మెరుగుపడుతుందని గడ్కరీ చెప్పారు.
ఫాస్ట్ట్యాగ్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?
ఫాస్ట్ట్యాగ్ అనేది వాహనాల విండ్షీల్డ్పై అమర్చిన ఓ డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ స్టిక్కర్ కలిగిన వాహనం టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పుడు, అక్కడ ఉండే సెన్సార్లు ఈ ట్యాగ్ని రీడ్ చేసి, ఫాస్ట్ట్యాగ్తో అనుసంధానించబడిన బ్యాంక్ లేదా ప్రీపెయిడ్ ఖాతా నుండి డబ్బును ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తాయి.