Just In
- 2 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 5 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 11 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఇటీవలి కాలంలో ఎస్యూవీలు, ఎమ్పివిల వంటి యుటిలిటీ వాహనాలకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో, దేశంలోని అన్ని కార్ కంపెనీలు ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి అధునాతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి.
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ కూడా ప్రస్తుతానికి తమ దృష్టంతా ఎస్యూవీలు, ఎమ్పివిలపైనే ఉందని గతంలో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే, కియా మోటార్స్ ఇప్పుడు మరో సరికొత్త ఎమ్పివిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే, ఈ కొత్త ఎమ్పివి టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కింది.
ఈ స్పై చిత్రాలను క్షణ్ణంగా పరిశీలిస్తే, కియా సెల్టోస్ ఎస్యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త ఎమ్పివిని అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కియా నుండి రానున్న ఈ సరికొత్త ఎమ్పివి, భారత మార్కెట్లో ఈ బ్రాండ్ యొక్క నాల్గవ మోడల్ కానుంది. కియా మోటార్స్ ఇప్పటికే సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్లను విక్రయిస్తోంది.
MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది
కియా మోటార్స్ ఇప్పటికే కార్నివాల్ అనే ప్రీమియం ఎమ్పివిని విక్రయిస్తోంది. అయితే, ధర పరంగా ఈ మోడల్ చాలా ఖరీదైనది. ఈ నేపథ్యంలో, కంపెనీ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండేలా ఈ కొత్త ఎమ్పివిని డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకొని కంపెనీ ఈ కొత్త ఎమ్పివిని త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
తాజా నివేదికల ప్రకారం, టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త కియా ఎమ్పివికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఎమ్పివి పొడవు 4.5 మీటర్లు ఉంటుందని, ఇది స్టాండర్డ్ ఎమ్పివి పరిమాణం అని చెబుతున్నారు. భారతదేశంలో, ఈ కొత్త కియా ఎమ్పివి మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా మరియు మహీంద్రా మరాజో వంటి ఎమ్పివిలతో పోటీ పడగలదు.
MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి
కొత్త కియా ఎమ్పివి 6-సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ కారు టెస్టింగ్ మోడల్లో ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, 5-స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారులో చాలా చోట్ల క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఈ కారుకి సంబంధించిన సమాచారం చాలా పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంది.
మీడియా నివేదికల ప్రకారం, సెల్టోస్ ఎస్యూవీలో ఉపయోగిస్తున్న 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త కియా ఎమ్పివిలోనూ ఉపయోగించవచ్చని సమాచారం. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 114 బిహెచ్పి శక్తిని మరియు 144 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 114 బిహెచ్పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్యూవీ పొందిన మహ్మద్ సిరాజ్
పెర్ఫార్మెన్స్ ప్రియుల కోసం కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ను కూడా అందించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్పి పవర్ మరియు 192 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుందని అంచనా.
కియా మోటార్స్ ఈ కొత్త ఎమ్పివిని కేవలం భారత మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కియా ఈ ఎమ్పివిని భారత మార్కెట్లో ప్రతి సంవత్సరం 50,000 యూనిట్లను మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఏటా 26,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యం పెట్టుకుంది.
MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే
కియా సెల్టోస్ మాదిరిగానే ఈ కొత్త కియా ఎమ్పివిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురం ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంటు యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల యూనిట్లు. కియా ఈ ఎమ్పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఏడాది చివరి నాటికి వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలవుతుందని అంచనా.
Source: Rushlane