కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

భారతదేశంలో అధికంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. అంతే కాకుండా లెక్కకు మించి ప్రజలు ఈ వైరస్ భారిన పడుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా హాస్పిటల్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది. ఈ విధమైన ఆక్సిజన్ కొరత కారణంగా కూడా ఎక్కువమంది మరణిస్తున్నారు.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది. దీని ప్రధాన కారణం భారతదేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయకపోవడం. కరోనా సోకిన ప్రజలు తగినంత ఆక్సిజన్ అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

కరోనా వైరస్ భారిన పడిన వారికి ఆక్సిజన్ అందించడానికి ఆసుపత్రులలో సిబ్బందితో పాటు కుటుంభం సభ్యులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కావున ఇటువంటి సమయంలో ఆక్సిజన్ రవాణా చేసే వాహనాల యొక్క కదలికలను తెలుసుకోవడానికి జిపిఎస్ అమలులోకి రానుంది. దీనికోసం అవసరమైన జిపిఎస్ పరికరాలను ఉచితంగా అందిస్తామని ఇటీవల 'మ్యాప్ మై ఇండియా' ప్రకటించింది.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

దీని గురించి మ్యాప్ మై ఇండియా సీఈఓ రోహన్ వర్మ తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ప్రకటించారు. ఈ జిపిఎస్ పరికరాలను కలిగిన వాహనాలు యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించవచ్చు. అంటే వాహనం ఎక్కడికి వెళుతుందో మరియు అది ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి ఈ జిపిఎస్ సహాయపడుతుంది.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

మెడిషన్స్ మరియు ఆక్సిజన్ తరలించే వాహనాల యజమానులు ఎక్కడ వస్తున్నారో మొదలైన విషయాలను ఆక్సిజన్ సిలిండర్ల గ్రహీతలు ఆ వాహనాలకు జిపిఎస్ కలిగి ఉండటం వల్ల వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

ఆక్సిజన్ సిలిండర్లు తరలించే వాహనాలకు కేవలం 15 నిమిషాల్లో ఈ జీపీఎస్ పరికరాన్ని వ్యవస్థాపించవచ్చని మ్యాప్ మై ఇండియా తెలిపింది. మ్యాప్ మై ఇండియా ఈ జిపిఎస్ పరికరాలను అందించి ఎప్పటికప్పుడు అత్యవసర వాహనాల కదలికలను తెలుసుకోవడానికి సహాయ పడటం వల్ల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాలామంది ప్రశంసిస్తున్నారు.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత కారణంగా చాలా చోట్ల ఆక్సిజన్ తరలింపు చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ జిపిఎస్ పరికరాల సాయంతో ఈ ఆక్సిజన్ తరలించే వాహనాల స్థానాన్ని సులభంగా గుర్తించవచ్చు. అంతే కాకుండా వాహన ఆలస్యం గురించి కూడా సమాచారం పొందవచ్చు.

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

రెండవ మరియు మూడవ శ్రేణి నగరాలలో జిపిఎస్‌కు డిమాండ్ ఉందని రోహన్ వర్మ తెలిపారు. అది మాత్రమే కాకుండా మ్యాప్ మై ఇండియా ఈ ప్రాసెస్ లోనే కరోన టెస్టింగ్ సెంటర్స్, ట్రీట్మెంట్ సెంటర్స్, పరిమితం చేయబడిన ప్రాంతాలు మరియు టీకా కేంద్రాల సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. ఏది ఏమైనా ఈ జిపిఎస్ సిస్టం ద్వారా ప్రస్తుతం చాలా ఉపయోగాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 3, 2021, 18:24 [IST]
English summary
Map My India To Give Free GPS Tracker For Oxygen Carrying Vehicles. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+