Just In
- 4 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 7 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏప్రిల్ 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, గత నెలలో మారుతి మొత్తం 1,59,691 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ మొత్తం అమ్మకాలలో 1,37,151 యూనిట్లు దేశీయ మార్కెట్లో అమ్ముడు కాగా, 17,237 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది.
గత శనివారం (మే 1వ తేదీన) మారుతి సుజుకి బిఎస్ఇ రెగ్యులేటరీ ఫైల్ను దాఖలు చేసే సమయంలో ఈ వివరాలను వెల్లడి చేసింది. ఏప్రిల్ 2020లో పూర్తి లాక్డౌన్ కారణంగా మారుతి సుజుకి ఎలాంటి అమ్మకాలను నమోదు చేయలేదు కాబట్టి, ఈ సమయంతో పోల్చితే కంపెనీ అమ్మకాలలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్లు చూపిస్తుంది.
కాగా, ఏప్రిల్ 2019 నెలలోలో, మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులతో కలిపి మొత్తం అమ్మకాలు 1,43,245 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఏప్రిల్ 2021లో మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు ఏప్రిల్ 2019 నెల స్థాయిని దాటినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మార్చి 2020 చివరి భాగంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన సంగతి తెలిసినదే. లాక్డౌన్ ప్రకటించిన తరువాత, మారుతి సుజుకి స్థానికంగా ఎటువంటి కార్లను విక్రయించలేదు. అయితే, గత సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీ 632 వాహనాలను ఎగుమతి చేసింది.
గత ఏడాది ద్వితీయార్ధంలో (మే 2021లో) ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత కంపెనీ అమ్మకాలు క్రమంగా కోలుకోవటం ప్రారంభించాయి. మారుతి సుజుకి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 2021లో ఆల్టో, ఎస్-ప్రెసోతో సహా 25,041 యూనిట్ల మినీ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.
MOST READ:విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి
అదే సమయంలో వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్, టూర్ ఎస్ వంటి మోడళ్ల అమ్మకాలు 72,318 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిడ్-సైజ్ సెడాన్ మారుతి సుజుకి సియాజ్ విషయానికి వస్తే, ఏప్రిల్ 2021లో ఇవి 1,567 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలను రెండూ కలిపి చూస్తే, మొత్తం దేశీయ అమ్మకాలు 1,37,151 యూనిట్లుగా ఉన్నాయి.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే
ఏప్రిల్ 2019 అమ్మకాల గురించి మాట్లాడితే, మారుతి సుజుకి మొత్తం దేశీయ మార్కెట్లో 1,33,704 యూనిట్లను విక్రయించింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ యొక్క ఏప్రిల్ 2021 నెల దేశీయ అమ్మకాలు, ఏప్రిల్ 2019 నెల దేశీయ అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలుపుతున్నాయి.
ఇదిలా ఉంటే, దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, మారుతి సుజుకి తమ అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకూ మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. ఈ ప్లాంట్ లాక్డౌన్ సమయాన్ని కంపెనీ వార్షిక నిర్వహణ కోసం వినియోగించనుంది.
MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల హవా
అలాగే, వైద్య అవసరాల కోసం వినియోగించబడే ఆక్సిజెన్ తయారీని కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం, దేశంలో కోవిడ్-19 సంక్రమణ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఉంది, ఫలితంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.