Just In
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరోసారి ఔదార్యం చాటుకున్న మారుతి సుజుకి; ప్రభుత్వాసుపత్రులలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా దాదాపు గత నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ వైరస్పై పోరులో భాగంగా, ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు ముందుకొచ్చి తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గతంలో తమ ప్లాంట్లలో కార్ల తయారీని నిలిపివేసి, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించింది. కాగా, ఈ భారతీయ కంపెనీ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకుంది.
మారుతి సుజుకి హర్యానాలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో 4 ఆక్సిజన్ పిఎస్ఎ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ ఆక్సిజన్ పిఎస్ఎ ప్లాంట్లను స్వయంగా ప్రారంభించారు. హర్యానా రాష్ట్రంలో ప్రారంభించిన 4 ఆక్సిజన్ పిఎస్ఎ జనరేషన్ ప్లాంట్లలో ఇది మొదటి బ్యాచ్.
గురుగ్రామ్లోని సెక్టార్ 10లో ఉన్న సివిల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ పిఎస్ఎ ప్లాంట్లలో ఒకటి రోజుకి 1 టన్ను మరియు ఇంకొకటి రోజుకు 0.5 టన్ను ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలవు. అలాగే, గురుగ్రామ్లోని సెక్టార్ 9ఏ మరియు సెక్టార్ 3లో ఉన్న ఈఎస్ఐసి ఆస్పత్రులలో, రోజుకు 1 టన్ను ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను కంపెనీ ఏర్పాటు చేసింది.
దేశంలో ఆక్సిజన్ పిఎస్ఎ ప్లాంట్లను ఉత్పత్తి చేసే స్థానిక చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తామని మారుతి సుజుకి ఇప్పటికే ప్రకటించింది. ఇది ఆక్సిజన్ ప్లాంట్ల తయారీని పెంచడంలో సహకరిస్తుంది. ఇప్పటికే, అనేక ఆక్సిజన్ ప్లాంట్ల తయారీతో మారుతి సుజుకి తమ సహకారాన్ని పెంచుకుంటోంది.
జూన్ 2021 మొదటి అర్ధభాగం నాటికి ఇలాంటివి 24 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మారుతి సుజుకి పేర్కొంది. మారుతి సుజుకి మరియు దాని సరఫరాదారులు సిఎస్ఆర్ చొరవలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా, ఈ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు విజయవంతంగా నిర్వహించడానికి కంపెనీ ఓ ప్రత్యేక బృందాన్ని కూడా నియమించింది.
ఆయా ఆస్పత్రులలో ఈ ఆక్సిజన్ జనరేటర్లను స్థాపించిన తర్వాత, అవి సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని నిర్ధారించడానికి బృందం కొన్ని నెలల పాటు తమ పర్యవేక్షణను కొనసాగిస్తుంది. ప్రచారం, ఛానెల్ విచారణ మరియు ఆర్డర్లను వ్యాప్తి చేయడానికి సంస్థ ఒక వెబ్సైట్ను కూడా సృష్టించింది. ఇది ఆస్పత్రుల అవసరాలను తీర్చుతుంది.
ఈ ప్రత్యేకమైన చొరవ గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్.సి.భార్గవ మాట్లాడుతూ, "కోవిడ్ వ్యాప్తిపై పోరులో భాగంగా, ఆక్సిజన్ కోసం పిఎస్ఎ ప్లాంట్ల ఉత్పత్తిని పెంచడానికి మారుతి సుజుకి ఈ3 తయారీదారులకు మద్దతు ఇస్తోందని, తాము ఈ ప్రాజెక్టులోకి ప్రవేశించిన ఒక నెలలోనే, ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లను 10 రెట్లు పెంచే సామర్థ్యంతో పనిచేస్తున్నామని అన్నారు.
మే నెలలో 70 ప్లాంట్లను మరియు జూన్ నెలలో 150 ప్లాంట్లను పంపిణీ చేయాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం అంచనా వేసిన ఉత్పత్తి కంటే ఎక్కువ.
ఈ ప్రయత్నం గురించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ మాట్లాడుతూ, "హర్యానా రాష్ట్ర అభివృద్ధిలో మారుతి సుజుకి చాలా కీలక పాత్రను పోషిస్తందని, అవసరం వచ్చిన ప్రతిసారి మారుతి సుజుకి తనవంతు సాయం చేస్తూ ఉంటుందని, కరోనా మొదటి వేవ్ సమయంలో కూడా రాష్ట్రంలో చాలా అవసరమైన వెంటిలేటర్లతో ముందుకు వచ్చిన మొదటి సంస్థలో మారుతి సుజుకి కూడా ఒకటి" అని ఆయన చెప్పారు.