Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఐదేళ్లలో అరుదైన రికార్డ్ సాధించిన మారుతి సుజుకి నెక్సా బ్రాండ్
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో, దేశంలోనే నెంబర్ వన్ కార్ బ్రాండ్గా ఉన్న మారుతి సుజుకి ఇండియా, దేశీయ మార్కెట్లో తమ ప్రీమియం కార్లను విక్రయించేందుకు ప్రత్యేకంగా నెక్సా డీలర్షిప్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే.
గత ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ నెక్సా బ్రాండ్ ఇప్పుడు అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మారుతి సుజుకి తమ స్టాండర్డ్ కార్లను అరేనా షోరూమ్ల ద్వారా మరియు కాస్తంత ప్రీమియం అయిన కార్లను నెక్సా షోరూమ్ల ద్వారా విక్రయిస్తోంది.
గత 2015లో ప్రారంభమైనప్పటి నుండి మారుతి సుజుకి నెక్సా షోరూమ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా 13 లక్షలకు పైగా కార్లను విక్రయించాయి. ప్రస్తుతం నెక్సా కార్ షోరూమ్ల ద్వారా బాలెనో, సియాజ్, ఇగ్నిస్, ఎక్స్ఎల్-6 మరియు ఎస్-క్రాస్ మోడళ్లను విక్రయిస్తున్నారు.
మొదట్లో మారుతి నెక్సా షోరూమ్లను ప్రారంభించినప్పుడు, ఈ షోరూమ్ల ద్వారా కేవలం ఎస్-క్రాస్ మోడల్ను మాత్రమే విక్రయించే వారు. ఆ తర్వాత కంపెనీ ఈ షోరూమ్లలో తమ ప్రీమియం మోడళ్ల లైనప్ను క్రమంగా పెంచుతూ వస్తోంది.
మారుతి సుజుకి ఇండియా గత ఏడాది సరికొత్త ఎస్-క్రాస్ ఫేస్లిఫ్ట్ మోడల్ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ రాకతో ఎస్-క్రాస్ అమ్మకాలు ఇదివరకటిన్నా రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ మరియు మూడవ త్రైమాసికాల్లో ఈ కారు అమ్మకాలు 104 శాతం పెరిగాయి.
అలాగే, గడచిన 2017లో ప్రారంభమైన మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాలు కూడా మొత్తంగా 1.4 లక్షల యూనిట్లకు చేరుకున్నట్లు మారుతి సుజుకి ఇండియా పేర్కొంది. దీని ఆకర్షణీయమైన డిజైన్ యవ కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.
మారుతి సుజుకి పేర్కొన్న నివేదిక ప్రకారం, సుజుకి ఇగ్నిస్ కారును కొనేవారిలో 45 శాతానికి పైగా కస్టమర్లు 35 ఏళ్లలోపు వారేనని సమాచారం. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లో మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ బ్రాండ్గా నెక్సా తన ప్రముఖ స్థానాన్ని కొనసాగిస్తున్నందకు తామెంతో గర్విస్తున్నామని అన్నారు.