డిసెంబర్ 2019 కంటే డిసెంబర్ 2020లోనే బెటర్: మారుతి సుజుకి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గడచిన డిసెంబర్ నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను సాధించింది. డిసెంబర్ 2020 నెలలో తమ మొత్తం అమ్మకాలలో 20.2 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి గత డిసెంబర్ 2020లో మొత్తం 1,60,226 యూనిట్లను విక్రయించగా, డిసెంబర్ 2019లో 1,33,296 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ సమయంతో పోలిస్తే, కంపెనీ వార్షిక అమ్మకాలు 20.2 శాతం పెరిగాయి.

గత నెలలో మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు (డొమెస్టిక్ సేల్స్) కూడా వృద్ధిని సాధించాయి. డిసెంబర్ 2020లో కంపెనీ మొత్తం 1,50,288 యూనిట్లను భారతదేశంలో విక్రయించగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో వీటి అమ్మకాలు 1,25,753 యూనిట్లుగా నమోదై 19.5 శాతం వృద్ధిని సాధించాయి.

ఈ దేశీయ అమ్మకాలలో ఇతర ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్)లకు పంపిన 3,808 యూనిట్లు కూడా ఉన్నాయి. ఈ మోడళ్లలో టొయోటా అర్బన్ క్రూయిజర్గా విక్రయించబడే మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు టొయోటా గ్లాంజాగా అమ్మబడే మారుతి సుజుకి బాలెనో మోడళ్లు ఉన్నాయి.

గత నెలలో మారుతి సుజుకి ఇండియా ఎగుమతుల విషయానికి వస్తే, డిసెంబర్ 2020లో కంపెనీ మొత్తం 9,938 యూనిట్లను ఎగుమతి చేసింది. డిసెంబర్ 2019లో వీటి సంఖ్య 7561 యూనిట్లుగా నమోదై 31.4 శాతం వృద్ధిని సాధించాయి.

ప్యాసింజర్ వాహన విభాగంలో మారుతి సుజుకి అందిస్తున్న వివిధ రకాల హ్యాచ్బ్యాక్లు అన్నీ కలిపి 77,641 యూనిట్లుగా నమోదై 18.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మోడళ్ల జాబితాలో వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో మొదలైనవి మోడళ్లు ఉన్నాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లతో కూడిన మినీ సెగ్మెంట్ డిసెంబర్ 2019లో 23,883 యూనిట్లుగా ఉంటే, డిసెంబర్ 2020లో 24,927 యూనిట్లుగా నమోదై 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబర్ 2020లో మారుతి సుజుకి యుటిలిటీ వాహన విభాగం కూడా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగంలో విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ మరియు ఎక్స్ఎల్6 వంటి మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది. ఈ విభాగంలో గత నెలలో 25,701 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, డిసెంబర్ 2019లో ఇవి 23,808 యూనిట్లుగా ఉన్నాయి.

కాగా, మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో కంపెనీ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ విభాగంలో కంపెనీ ఒకే ఒక మోడల్ను మాత్రమే విక్రయిస్తోంది. డిసెంబర్ 2020లో సియాజ్తో కూడిన మిడ్-సైజ్ సెడాన్ విభాగం 28.9 శాతం క్షీణతను నమోదు చేసింది. గత డిసెంబర్ 2019లో 1,786 యూనిట్ల సియాజ్ కార్లు అమ్ముడుపోగా, డిసెంబర్ 2020లో 1,270 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మొత్తంగా చూసుకుంటే, మారుతి సుజుకి ఇండియా గడచిన ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో అమ్మకాల పరంగా 18 శాతం క్షీణతను నమోదు చేసింది. ఏప్రిల్-డిసెంబర్ 2020 మధ్య కాలంలో కంపెనీ 9,65,626 యూనిట్లను విక్రయించగా 2019లో ఇదే కాలంలో 11,78,272 యూనిట్లను విక్రయించింది. లాక్డౌన్ కాలంలో సున్నా అమ్మకాలు నమోదు కావటమే ఈ క్షీణతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications