Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 5 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ
ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మళ్ళీ మొదలైపోయింది. ఇప్పుడు చాలా దేశాలతో పాటు భారతదేశంలో కూడా అధికంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో కూడా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, న్యూ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది.
రోజు రోజుకి ఎక్కువమంది ఈ వైరస్ భారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా సంక్రమణ రోజు రోజుకి అధికంగానే ఉంది.
కరోనా వైరస్ సంక్రమణను తగ్గించడానికి ఇటీవల ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. దీని ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో కరోనాకు వ్యతిరేకంగా హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..
దీని ప్రకారం ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ఒంటరిగా కూడా కారు నడుపుతున్నట్లైతే వారికి కూడా పేస్ మాస్క్ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ సమయంలో మాస్క్ తప్పని సరి కావున అందరూ తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలి అని హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఒంటరిగా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలి, లేకుంటే జరిమానా విధించబడుతుంది. ఇంతకుముందు ఒంటరిగా ప్రయాణించేవారికి పేస్ మాస్క్ అవసరం లేదు, అయితే వైరస్ సంక్రమణ అధికంగా ఉంది కావున తప్పనిసరి.
ఒక వ్యక్తికి టీకా వేసుకున్నా, వేసుకోకపోయినా పేస్ మాస్క్ ధరించి తీరాలి అని ఆదేశాలు జరీ చేయబడ్డాయి. కోవిడ్కు వ్యతిరేకంగా సురక్షితంగా ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాల సలహాలను ఆయన తెలిపారు.
MOST READ:ఓటువేయడానికి సైకిల్పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగినప్పుడు, డ్రైవర్ తరచుగా తన కిటికీని మూసివేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మాస్క్ లేకుండా ఒంటరిగా డ్రైవ్ చేస్తే వారికీ 500 రూపాయల జరిమానాను విధించబడుతుంది.
ఒకే డ్రైవర్ ఉన్నప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత నియమాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి హక్కు ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు లేదా ప్రభుత్వ వాహనాల్లో అందరికీ మాస్క్ ఉండాలని నిర్ణయించింది.
MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి
ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లోనే ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మాస్క్ ధరించడం అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ సమయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి.