Just In
- 56 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Movies
రిలీజ్కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- Sports
రోహిత్ అండ్ టీమ్పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ
ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మళ్ళీ మొదలైపోయింది. ఇప్పుడు చాలా దేశాలతో పాటు భారతదేశంలో కూడా అధికంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో కూడా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, న్యూ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది.

రోజు రోజుకి ఎక్కువమంది ఈ వైరస్ భారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా సంక్రమణ రోజు రోజుకి అధికంగానే ఉంది.

కరోనా వైరస్ సంక్రమణను తగ్గించడానికి ఇటీవల ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. దీని ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో కరోనాకు వ్యతిరేకంగా హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

దీని ప్రకారం ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ఒంటరిగా కూడా కారు నడుపుతున్నట్లైతే వారికి కూడా పేస్ మాస్క్ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ సమయంలో మాస్క్ తప్పని సరి కావున అందరూ తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలి అని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఒంటరిగా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలి, లేకుంటే జరిమానా విధించబడుతుంది. ఇంతకుముందు ఒంటరిగా ప్రయాణించేవారికి పేస్ మాస్క్ అవసరం లేదు, అయితే వైరస్ సంక్రమణ అధికంగా ఉంది కావున తప్పనిసరి.
ఒక వ్యక్తికి టీకా వేసుకున్నా, వేసుకోకపోయినా పేస్ మాస్క్ ధరించి తీరాలి అని ఆదేశాలు జరీ చేయబడ్డాయి. కోవిడ్కు వ్యతిరేకంగా సురక్షితంగా ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాల సలహాలను ఆయన తెలిపారు.
MOST READ:ఓటువేయడానికి సైకిల్పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగినప్పుడు, డ్రైవర్ తరచుగా తన కిటికీని మూసివేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మాస్క్ లేకుండా ఒంటరిగా డ్రైవ్ చేస్తే వారికీ 500 రూపాయల జరిమానాను విధించబడుతుంది.

ఒకే డ్రైవర్ ఉన్నప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత నియమాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి హక్కు ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు లేదా ప్రభుత్వ వాహనాల్లో అందరికీ మాస్క్ ఉండాలని నిర్ణయించింది.
MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లోనే ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మాస్క్ ధరించడం అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ సమయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి.