Just In
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 17 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 19 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన: రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు!
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. తాజాగా, రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చేలా ట్రాక్టర్లు కొనే రైతులకు భారీ సబ్సిడీ ఇచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
'ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన' పేరిట ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులు ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్లనైనా సబ్సిడీతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రైతులకు ట్రాక్టర్ ధరలో సుమారు 50 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుంది.
అంటే, రైతులు ట్రాక్టర్ అసలు ధరలో సగం ధర మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
వ్యవసాయంలో రైతులకు అతి ముఖ్యమైన పరికరాలలో ట్రాక్టర్ కూడా ఒకటి. ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం ద్వారా రైతులే స్వయంగా ఓ ట్రాక్టరును కొనుగోలు చేయవచ్చు, దీంతో ఇకపై వారు ట్రాక్టర్లను అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
వివిధ రాష్ట్రాల్లో ఈ సబ్సిడీ వేర్వేరుగా ఉంటుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ట్రాక్టర్లు కొనడానికి తమ సొంత స్థాయిలో 20 నుంచి 50 వరకూ శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో 'ఈ యంత్ర కృషి అనుదాన్' అనే పథకం క్రింద రైతులకు వివిధ వ్యవసాయ పరికరాల కొనుగోలుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది.
'పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన' ప్రయోజనాన్ని ఎలా పొందాలి?
పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన కోసం రిజిస్టర్ చేసుకున్న రైతుకు మొదటి షరతు ఏమిటంటే.. సదరు రైతు గత 7 సంవత్సరాలలో ఏదైనా ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉండకూడదు. ఈ పథకం క్రింద ఒక రైతు ఒక ట్రాక్టర్ను మాత్రమే కొనుగోలు చేయగలడు.
అంతే కాకుండా ఈ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడానికి ఒక రైతుకు అవసరమైన అన్ని పత్రాలు మరియు అతడు లేదా ఆమె పేరు మీద వ్యవసాయ భూమి కూడా ఉండాలి.
పిఎమ్ కిసాన్ ట్రాక్టర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పథకం కోసం రైతులు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు వారు చేయాల్సిందల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి లేదా సమీప సిఎస్సి కేంద్రానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం:
సాధారణ సేవా కేంద్రంలో, దరఖాస్తు ఫారమ్ తీసుకొని అందులో అడిగిన సమాచారం పేరు, చిరునామా మొదలైన వివరాలు నింపాలి నింపండి. ఆ తరువాత, మీ పత్రాలన్నింటినీ దరఖాస్తు ఫారంతో అటాచ్ చేసి అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతు ఆధార్ కార్డు, ల్యాండ్ పేపర్లు, బ్యాంక్ వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫోటో మొదలైన పత్రాలు అవసరం.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన వెబ్సైట్ మరియు అందులో ఓ స్వంత లింక్ ఉంటాయి. వాటిపై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో నింపవచ్చు. ఈ విధంగా ధరఖాస్తు చేసుకున్న వారి అర్హతను పరిశీలించిన తర్వాత వారికి ట్రాక్టర్ కొనుగోలుపై కేంద్రం సబ్సిడీని అందించడం జరుగుతుంది.