Just In
- 48 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 14 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 20 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!
దేశంలో పాత వాహనాల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో 15 ఏళ్లకు పైగా వయస్సు నిండిన వాహనాలు 4 కోట్ల పైచిలుకు ఉన్నట్లు పేర్కొంది.
ఇలాంటి వాహనాలన్నీ గ్రీన్ టాక్స్ వర్గంలోకి వస్తాయి. దేశంలో అత్యధికంగా పాతకాలపు వాహనాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్లు సదరు నివేదికలో తెలిపారు. కర్ణాటకలో 15 ఏళ్లు పైబడిన వాహనాల సంఖ్య 70 లక్షలకు పైగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల రికార్డుల ప్రకారం పాత వాహనాల డేటాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ మరియు లక్షద్వీప్ ప్రాంతాల నుండి డేటా అందుబాటులో లేనందున, ఈ జాబితా నుండి సదరు ప్రాంతాలు మినహాయించబడ్డాయి. హరిత పన్నుకు (గ్రీన్ టాక్స్) సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్రాలకు పంపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు
పాత వాహనాల్లో, గ్రీన్ టాక్స్కు వర్తించే వాహనాలు 2 కోట్లకు పైగా ఉంటాయని, వాటి రిజిస్ట్రేషన్ వయస్సు సుమారు 20 ఏళ్ళకు పైగా ఉంటుందని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.
పురాతన వాహనాల జాబితాలో రాష్ట్రాల వారీగా చూస్తే, కర్ణాటక తర్వాత 56.54 లక్షల వాహనాలతో ఉత్తర ప్రదేశ్ రెండవ స్థానంలో ఉండగా, 50 లక్షల వాహనాలతో ఢిల్లీలో మూడవ స్థానంలో ఉంది. ఇలాంటి వాహనాలన్నీ నిర్దేశించిన ప్రమాణం కంటే ఎక్కువ కాలుష్యానికి కారణమవుతున్నాయి.
MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్లకు పైబడిన వాహనాలు 35.11 లక్షలు ఉన్నాయి. కేరళలో 33.43 లక్షలు, తమిళనాడులో 33.43 లక్షలు, పంజాబ్లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 22.69 లక్షల వాహనాలు నిర్దేశించిన కాల పరిమితి కంటే పాతవిగా గుర్తించబడ్డాయి. అదే సమయంలో, అనేక ఇతర రాష్ట్రాల్లో, 1 లక్ష నుండి 5 లక్షల మధ్య పాత వాహనాలు నడుస్తున్నాయి.
పాత వాహనాల జాబితాలో హైబ్రిడ్, సిఎన్జి, ఇథనాల్, ఎల్పిజి మరియు బ్యాటరీలపై నడిచే వాహనాలను మినహాయించారు. నిర్ణీత పరిమితి కంటే పాత వాహనాలపై ప్రభుత్వం హరిత పన్ను (గ్రీన్ టాక్స్) విధిస్తుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పాత వాహనాల నుండి విధించే పన్ను మొత్తం స్వచ్ఛమైన శక్తితో నడుస్తున్న ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు.
MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ
హరిత పన్ను (గ్రీన్ టాక్స్)కు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు పాత వాహనాల నుండి గ్రీన్ టాక్స్ వసూలు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం, 15 సంవత్సరాల కంటే పాతబడిన వాణిజ్య వాహనాలపై మరియు 20 సంవత్సరాల కంటే పాతబడిన ప్రైవేట్ వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించబడుతుంది.
ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితికి మించి ప్రజలు ఎక్కువ సమయం పాత వాహనాలను ఉపయోగించకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. సాధారణంగా 15 లేదా 20 సంవత్సరాల కంటే పైబడిన పాత వాహనాలు కొత్త వాహనాలతో పోలిస్తే 10-12 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి, ఇది దేశంలో వాయు కాలుష్య స్థాయిని మరింత పెంచుతుంది.
MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]
కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం వాణిజ్య మరియు ప్రైవేట్ వాహన యజమానులు తమ పాత వాహనాలను స్వచ్చందంగా స్క్రాప్ చేయవచ్చు. ఇలా స్క్రాప్ చేసిన వారికి ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై రాయితీలను మరియు పన్నుల్లో తగ్గింపులు వంటి ప్రోత్సాహాకలను అందించనుంది.
ఈ వెహికల్ స్క్రాపింగ్ విధానం కోసం ప్రభుత్వం రూ.10,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ విధానం ద్వారా 50,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ విధానం ప్రకారం, పాత హెవీ, మీడియం మరియు తేలికపాటి వాహనాలను స్క్రాప్ చేస్తారు. వెహికల్ స్క్రాప్ విధానంతో దేశంలో ఆటోమొబైల్ తయారీదారుల వ్యాపారం కూడా 30 శాతం పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఇది రూ.4.5 లక్షల కోట్లుగా ఉంది.