Just In
- 1 hr ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 2 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 3 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 5 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్
వాహనదారులు వాహనాన్ని నడపడానికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. అప్పుడే అధికారికంగా వాహాన్ని డ్రైవ్ చేయడానికి అర్హులు. కావున చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కోసం నానా తంటాలు పడుతుంటారు. ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కోసం కొన్ని రాష్ట్రాలు డిజిటల్ విధానాన్ని అమలు చేసి చాలా సులభతరం చేశాయి.
భారతదేశంలో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మరియు ఢిల్లీ-ఎన్సిఆర్ పౌరులు ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు రవాణా శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా https://parivahan.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ వెబ్సైట్ లో దరఖాస్తుదారుడి చిరునామా మరియు గుర్తింపు సమాచారాన్ని నింపిన తరువాత లైసెన్స్ పొందటానికి అర్హులవుతారు. లర్నర్ లైసెన్స్ దరఖాస్తు ప్రక్రియలో ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తుదారునికి 10 ప్రశ్నలు అడుగుతారు, అందులో 6 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినవారికి లర్నర్ లైసెన్స్ ఇవ్వబడుతుంది.
MOST READ:హైదరాబాద్లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?
లెర్నర్ లైసెన్స్ దరఖాస్తుదారునికి ఇ-మెయిల్ ద్వారా పంపబడుతుంది. లర్నర్ కి ఆన్లైన్లో లైసెన్స్ ఇవ్వడం వల్ల సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. ఈ ప్రక్రియలో ఆన్లైన్ చెల్లింపు చేసిన తరువాత, దరఖాస్తుదారు అందుబాటులో ఉన్న స్లాట్ల నుండి టెస్ట్ డేట్ మరియు టైమ్ ఎంచుకోవచ్చు.
ఈ ప్రక్రియ కోసం ఢిల్లీలో నాలుగు కొత్త ఆర్టీఓ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయి. ఢిల్లీలో ఇప్పుడు 13 ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్, ఇంటర్నేషనల్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్ కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయి.
MOST READ:ఇలాంటి రోల్స్ రాయిస్ కారును ఎప్పుడైనా చూశారా? ఇది ఏ సెలబ్రిటీదో తెలుసా?
ఇటీవల ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ఛార్జింగ్ స్టేషన్లను ఓపెన్ చేయడానికి అనుబంధ కంపెనీలు టెండర్లను పిలిచాయి. ఆగస్టు 2020 నాటికి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అమలు చేయబడింది. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 6,000 వాహనాలు నమోదు చేయబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ వాహన విధానంలో భాగంగా, ఢిల్లీ ప్రభుత్వం రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీని అందిస్తుంది.
MOST READ:అరుదైన లగ్జరీ కార్లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]
ఈ పథకం కింద 1,000 ఎలక్ట్రిక్ వాహనాలకు కిలోవాట్ కి 10,000 రూపాయల సబ్సిడీని ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలపై గరిష్టంగా రూ. 1.50 లక్షల రాయితీ ఇవ్వబడుతుంది. ఈ రాయితీలన్నీ ఎలక్ట్రిక్ వాహన వాడకాన్ని పెంచడానికి మరియు రాజధాని నగరంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడతాయి.