Just In
- 2 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 23 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?
భారతదేశంలో జార్ఖండ్ రాజధాని నగరమైన రాంచీలో మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి, రాంచీ మునిసిపల్ కార్పొరేషన్ పింక్ సిటీ బస్ సర్వీసులను ప్రారంభించింది. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేయర్ మరియు మునిసిపల్ కమిషనర్ ఈ బస్సును ఫ్లాగ్ చేసి ప్రారంభించారు.
ఈ పింక్ సర్వీస్ లో ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ బస్ సర్వీసు కేవలం మహిళల కోసం మాత్రమే కేటాయించబడింది. ఈ బస్ లో కండక్టర్ నుంచి బస్ డ్రైవర్ వరకు అందరూ మహిళలే ఉంటారు. ఈ బస్సులు కూడా పింక్ కలర్ లోనే ఉంటాయి.
ఈ పింక్ బస్సులో కనీస ఛార్జ్ కేవలం 5 రూపాయలు మాత్రమే. ఈ బస్ సర్వీస్ చాలా సురక్షితంగా ఉండటం వల్ల మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వుండవు. దేశంలో రోజురోజుకి స్త్రీలమీద జరుగుతున్న అత్యాచారాలను ఆపడానికి ఈ బస్ సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా
ఈ ప్రత్యేక బస్సులో 30 మంది మహిళా ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించగలరు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మహిళలతోపాటు పిల్లలు కూడా ఈ బస్సులో ప్రయాణించవచ్చు. ఇలాంటి బస్ సర్వీసులను మరిన్ని మార్గాల్లో నడపడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచిస్తోంది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో మహిళల కోసం ఇప్పటికే పింక్ ఆటోలో నడుస్తున్నాయి. ఇందులో డ్రైవర్స్ కూడా స్త్రీలే ఉంటారు. మహిళా డ్రైవర్లు కొన్ని చోట్ల కొరతగా ఉండటం వల్ల కొన్ని చోట్ల మగ డ్రైవర్లు ఉంటారు. ఇందులో అత్యధిక భాగం మహిళా డ్రైవర్లనే నియమిస్తారు.
MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?
బస్సులను డ్రైవ్ చేయడానికి మహిళలను నియమించడం నిజంగా ప్రశంసనీయం. నిజానికి మహిళలు ఆటోలో ప్రయాణించడం అంత సులభం కాదు, అంతే కాదు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ బస్సులు మహిళల కోసం మాత్రమే కావున మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
రాంచీ మేయర్ ఆశా లక్రా మహిళల కోసం ఈ బస్సు సర్వీసు ప్రారంభించి, దీనికి పింక్ సిటీ బస్ సర్వీస్ అని పేరు పెట్టారు. ఈ సమయంలో, ఇవి కేవలం రెండు బస్సులను ప్రస్తుతం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తరువాత అలాంటి 10 బస్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు.
MOST READ:సుజుకి హయాబుసా సూపర్బైక్పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]
రాంచీలో ఈ బస్సులు ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల నడుస్తాయి. ఈ బస్సు కచ్రి చౌక్ నుండి బిర్సా చౌక్ వరకు 7 కి.మీ. ప్రయాణిస్తాయి. దీని కోసం టికెట్టు కేవలం మహిళలకు రూ. 5 రూపాయలు వసూలు చేస్తారు. ఏది ఏమైనా మహిళల కోసం ప్రారంభించిన ఈ బస్ సర్వీస్ చాలా ప్రశంసనీయం.