Just In
- 3 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 58 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెబ్సైట్ నుంచి స్కోడా కరోక్ ఎస్యూవీ ఔట్.. ఎందుకంటే?
భారత మార్కెట్లో స్కోడా కంపెనీ యొక్క కరోక్ ఎస్యూవీ మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయిన తరువాత, ఇది వెబ్సైట్ నుండి కూడా తొలగించబడింది. స్కోడా కంపెనీ ఈ ఎస్యూవీని దేశీయ మార్కెట్లో 2020 మే నెలలో విడుదల చేసింది. అంతే కాకుండా దీనిని సిబియు మార్గంలో తీసుకువచ్చిన 1000 యూనిట్లను విక్రయించిన తరువాత స్థానికంగా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.

స్కోడా కరోక్కు భారతీయ మార్కెట్లో వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ కారణంగా ఇది సిబియు మోడల్ అయినప్పటికీ త్వరలో విక్రయించబడింది. దీని కారణంగా కంపెనీ దానిని తిరిగి తీసుకురావాలని ఆలోచిస్తోంది, అయితే ప్రస్తుతం కంపెనీ రాపిడ్, ఆక్టేవియా ఆర్ఎస్ 245 మరియు సూపర్బ్ అనే మూడు మోడళ్లను మాత్రమే మార్కెట్లో విక్రయిస్తోంది.

ఈ ఏడాది కంపెనీ కొత్త మోడల్ కుషాక్ను తీసుకురానుంది. తర్వాత కూడా ఇంకా కొత్త మోడల్స్ తీసుకు వస్తుందా అన్న సంగతి ఇంకా స్పష్టం కాలేదు.
ఇక స్కోడా కరోక్ విషయానికి వస్తే ఇది 2020 అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా అమ్ముడైంది. కాని కొత్త బ్యాచ్ను తీసుకువస్తుండగా అనేదాని గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. కొత్త నిబంధన ప్రకారం, కంపెనీ భారతదేశంలో హోమోలోగేషన్ లేకుండా సంవత్సరానికి 2500 యూనిట్ల వాహనాలను సికెడి మరియు సిబియు మార్గంలో తీసుకురాగలదు.
MOST READ:ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

ప్రస్తుతానికి స్కోడా కరోక్ ఎస్యూవీ యొక్క 1000 యూనిట్లను భారతదేశంలో తీసుకువచ్చారు. ఈ ఎస్యూవీని సింగిల్ వేరియంట్, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచారు. స్కోడా కైరోక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనరోమిక్ సన్రూఫ్, 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి.

వీటితో పాటు కరోక్ స్మార్ట్లింక్ కనెక్టివిటీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సేఫ్టీ పరంగా 9 ఎయిర్బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి మరియు ఇఎస్సి వంటివి ఉన్నాయి. స్కోడా కరోక్ ఎస్యూవీని చాలామంది కస్టమర్లు ఇష్టపడుతున్నారు.
MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

స్కోడా కరోక్ ఎస్యూవీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 148 బిహెచ్పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉంది. ఈ ఇంజన్ లీటరుకు 14.49 కిమీ మైలేజీని అందిస్తుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో స్కోడా ఇప్పుడిప్పుడే కోలుకుంటోది. ఈ సమయంలో తమ కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం వల్ల మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. స్కోడా కంపెనీ తన కొత్త మోడల్ కుషాక్ను ఈ సంవత్సరం మొదటి భాగంలో తీసుకురావచ్చు. దాని ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ ఇటీవల వెల్లడించింది.
MOST READ:బైక్నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]