Just In
- 7 hrs ago ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- 8 hrs ago పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- 9 hrs ago ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
- 9 hrs ago మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్.. బుక్ చేసుకున్న వారికి పండగే!
Don't Miss
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Movies Devara Business దేవర ప్రీ రిలీజ్ బిజినెస్తో మైండ్ బ్లాక్..NTR కెరీర్లోనే హయ్యెస్ట్గా! ఎన్ని కోట్లంటే?
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మొత్తం కార్ల ధరలను రూ.26,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.
అయితే, జనవరి 21న లేదా అంతకన్నా ముందు బుక్ చేసుకున్న టాటా కార్లకు మాత్రమే ఈ ధరల పెంపు వర్తించదని, అవి మునుపటి ధరల ప్రకారమే ఉంటాయని కంపెనీ తెలిపింది.
కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. వాహనాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్లనే వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి.
MOST READ: నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలో ప్రధాన ముడిపదార్థమైన స్టీల్ ధర, దేశంలో గత కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. దేశీయ డిమాండ్ మరియు ఇనుము ధాతువు ధరలు పెరగడం, అంతర్జాతీయ ధరలు పెరగడం మరియు ఉత్పత్తిని తగ్గించడం మరియు పరిమిత సంఖ్యలోనే దిగుమతులు చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
స్టీల్ ధరల పెరుగుదలతో పాటుగా ప్రస్తుతం భారతదేశంలో సెమీకండక్టర్ల కొరత ఏర్పడింది. ఈ సమస్య కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వాహన తయారీదారులను కూడా ఇబ్బంది పెడుతోంది.
MOST READ: లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..
కోవిడ్-19 మహమ్మారికి వీటి సరఫరా సజావుగా ఉండేది, అయితే ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ల కొరత అధికమైంది. ఈ కారణం చేతనే ఫోర్డ్ ఇండియా, దేశంలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
కాగా, ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ తన ప్యాసింజ్ వాహన శ్రేణికి డిమాండ్లో గణనీయమైన పెరుగుదలను చూసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలలో టాటా కార్ల అమ్మకాలు 39 శాతం పెరిగాయి.
MOST READ: పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత మార్కెట్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా తమ అమ్మకాల సమఖ్యను మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే, టాటా మోటార్స్ తాజాగా ఆల్ట్రోజ్ ఐ-టర్బో అనే కారుని ఆవిష్కరించింది.
మరికొద్ది రోజుల్లోనే ఈ కారు అధికారికంగా మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఆల్ట్రోజ్ ఐ-టర్బో తర్వాత టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సరికొత్త మోడల్ టాటా సఫారీ. భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా, టాటా మోటార్స్ తమ సరికొత్త సఫారీని ప్రారంభించనుంది.