Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా కస్టమర్లకు చేదు వార్త; రూ.26,000 మేర పెరిగిన కార్ల ధరలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మొత్తం కార్ల ధరలను రూ.26,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

అయితే, జనవరి 21న లేదా అంతకన్నా ముందు బుక్ చేసుకున్న టాటా కార్లకు మాత్రమే ఈ ధరల పెంపు వర్తించదని, అవి మునుపటి ధరల ప్రకారమే ఉంటాయని కంపెనీ తెలిపింది.

కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. వాహనాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్లనే వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి.
MOST READ: నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలో ప్రధాన ముడిపదార్థమైన స్టీల్ ధర, దేశంలో గత కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. దేశీయ డిమాండ్ మరియు ఇనుము ధాతువు ధరలు పెరగడం, అంతర్జాతీయ ధరలు పెరగడం మరియు ఉత్పత్తిని తగ్గించడం మరియు పరిమిత సంఖ్యలోనే దిగుమతులు చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

స్టీల్ ధరల పెరుగుదలతో పాటుగా ప్రస్తుతం భారతదేశంలో సెమీకండక్టర్ల కొరత ఏర్పడింది. ఈ సమస్య కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వాహన తయారీదారులను కూడా ఇబ్బంది పెడుతోంది.
MOST READ: లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

కోవిడ్-19 మహమ్మారికి వీటి సరఫరా సజావుగా ఉండేది, అయితే ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ల కొరత అధికమైంది. ఈ కారణం చేతనే ఫోర్డ్ ఇండియా, దేశంలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

కాగా, ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ తన ప్యాసింజ్ వాహన శ్రేణికి డిమాండ్లో గణనీయమైన పెరుగుదలను చూసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలలో టాటా కార్ల అమ్మకాలు 39 శాతం పెరిగాయి.
MOST READ: పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత మార్కెట్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా తమ అమ్మకాల సమఖ్యను మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే, టాటా మోటార్స్ తాజాగా ఆల్ట్రోజ్ ఐ-టర్బో అనే కారుని ఆవిష్కరించింది.

మరికొద్ది రోజుల్లోనే ఈ కారు అధికారికంగా మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఆల్ట్రోజ్ ఐ-టర్బో తర్వాత టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సరికొత్త మోడల్ టాటా సఫారీ. భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా, టాటా మోటార్స్ తమ సరికొత్త సఫారీని ప్రారంభించనుంది.