ఒకే రోజు 8 షోరూమ్లను ప్రారంభించిన టాటా మోటార్స్; ఎక్కడో తెలుసా?
భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' దేశీయ మార్కెట్లో కొత్తగా ఒకే రోజు ఎనిమిది షోరూమ్లను ఓపెన్ చేసింది. అది మాత్రమే కాకుండా ఈ షోరూమ్లన్నీ ఒకే నగరంలో ఓపెన్ చేయడం మరింత విశేషం. ఒక్క సారిగా ఒకే నగరంలో ఎనిమిది షోరూమ్లను ఓపెన్ చేసి రికార్డ్ సృష్టించింది.

టాటా మోటార్స్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ కొత్త షోరూమ్లన్నీ ప్రారంభించింది. ఇన్ని షోరూమ్లను ప్రారంభించడం వల్ల నగరవాసులు కార్లను కొనుగోలు చేయడం మరింత సులభతరం అవుతుంది. టాటా మోటార్స్ తన అమ్మకాల నెట్వర్క్ను పెంచడానికి గుజరాత్లో షోరూమ్లను తెరిచింది.

టాటా మోటార్స్ గుజరాత్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్ తన అమ్మకాల నెట్వర్క్ను విస్తరించడానికి మరియు వినియోగదారులను ఆకర్షించడానికి తన షోరూమ్లను తెరిచింది. టాటా మోటార్స్ గత ఏడాది కంటే ఈ ఏడాది గుజరాత్లో దాదాపు 95% అధిక అమ్మకాలను నమోదు చేసింది.

ఈ కారణంగా, గుజరాత్ వినియోగదారులకు అసాధారణమైన కస్టమర్ సేవలను అందించే లక్ష్యంతో కొత్త షోరూమ్లను తెరిచారు. టాటా మోటార్స్ ఆన్లైన్ సేల్స్ సర్వీస్ కూడా అందిస్తుంది. టాటా మోటార్స్ భారతీయ వినియోగదారులందరినీ ఆకర్షించదానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

టాటా మోటార్స్ కొత్త షోరూమ్లను ఓపెన్ చేయడం మాత్రమే కాకుండా, కొత్త వాహనాలను ప్రారంభించడం ద్వారా కూడా భారతీయ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. టాటా మోటార్స్ తన పరిధిని మరింత పెంచుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

టాటా మోటార్స్ భారత మార్కెట్లో తన కొత్త హెచ్బిఎక్స్ మైక్రో ఎస్యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. టాటా మోటార్స్ గత ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో హెచ్బిఎక్స్ మైక్రో ఎస్యూవీని ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటికే హెచ్బిఎక్స్ మైక్రో ఎస్యూవీ ఉత్పత్తిని ప్రారంభించింది.

హెచ్బిఎక్స్ మైక్రో ఎస్యూవీని త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. నివేదికల ప్రకారం, టాటా హెచ్బిఎక్స్ హార్న్బిల్ పేరుతో విక్రయించబడుతుంది. ఈ ఎస్యూవీ మహీంద్రా కెయువి ఎన్ఎక్స్టి, మారుతి సుజుకి ఇగ్నిస్ మరియు దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత త్వరలో విడుదల కానున్న హ్యుందాయ్ కాస్పర్తో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








