Just In
- 7 min ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 2 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 3 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 4 hrs ago ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- News మంగళగిరిలో దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
రూ.9000 పెరిగిన Nexon EV ధరలు; అయినప్పటికీ ఇదే చవకైన ఎలక్ట్రిక్ కార్!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న Tata Nexon EV ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధరను మరోసారి పెంచింది. ఈ ఏదాదిలో Nexon ఎలక్ట్రిక్ కారు ధరలు పెరగడం ఇది వరుసగా మూడవసారి పెరిగింది. తాజాగా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధరను కంపెనీ రూ. 9000 వరకు పెంచింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో Tata Nexon EV ఎలక్ట్రిక్ ఎస్యూవీ XM, XZ+, XZ+ Lux, XZ+ Dark మరియు XZ+ Lux Dark అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో XZ+, XZ+ లగ్జరీ వేరియంట్లు మాత్రమే ఈ ధరల పెరుగుదలను అందుకున్నాయి, మిగిలిన వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.
Tata Nexon EV యొక్క XM వేరియంట్ ప్రారంభ ధర రూ. 13.99 లక్షలుగానే ఇంది, ఇందులో ఎలాంటి మార్పు లేదు. కాగా, XZ+ వేరియంట్ ధర రూ. 15.56 లక్షల నుండి రూ. 15.65 లక్షలకు పెరిగింది, XZ+ Lux వేరియంట్ ధర రూ. 16.56 లక్షల నుండి రూ. 16.65 లక్షలకు పెరిగింది.
Variants | Old Price | New Price | Difference |
XM | ₹13.99 Lakh | ₹13.99 Lakh | NIL |
XZ+ | ₹15.56 Lakh | ₹15.65 Lakh | ₹9,000 |
XZ+ LUX | ₹16.56 Lakh | ₹16.65 Lakh | ₹9,000 |
XZ+ Dark | ₹15.99 Lakh | ₹15.99 Lakh | NIL |
XZ+ Lux Dark | ₹16.85 Lakh | ₹16.85 Lakh | NIL |
అదే సమయంలో, దాని XZ+ Drak మరియు XZ+ Lux Dark వేరియంట్ల ధరలలో కూడా ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు మరియు రూ. 16.85 లక్షలుగా ఉన్నాయి. ధరలు పెరిగినప్పటికీ, ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కెల్లా చవకైనదిగా మరియు ఎక్కువ రేంజ్ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంటుంది.
ఈ విభాగంలో, ప్రస్తుతం ఇతర కార్ కంపెనీలు అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లన్నీ కూడా సుమారు రూ. 20 లక్షల ధరకు పైనే అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో, Nexon EV ఇప్పటికీ కూడా చవకైన ఎలక్ట్రిక్ కారు గానే ఉంటుంది. బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ ప్రియుల కోసం Tata Motors తమ సరికొత్త Tigor EV ని కూడా ప్రవేశపెట్టింది. త్వరలోనే ఈ కారు అమ్మకాలు కూడా ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉంటే, Tata Motors తమ Nexon EV లో మరింత శక్తివంతమైన వేరియంట్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Tata Nexon EV గరిష్టంగా 129 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొత్తగా రానున్న కారు దీని కంటే అదనంగా 7 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం.
ఇక Tata Nexon EV విషయానికి వస్తే, కంపెనీ ఎలక్ట్రిక్ కారులో 30.2 kWh బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించింది. పూర్తి చార్జ్ పై ఇది గరిష్టంగా 312 కిలో మీటర్ల సర్టిఫైడ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 129 బిహెచ్పి పవర్ ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.
బ్యాటరీల చార్జింగ్ సమయం విషయానికి వస్తే, డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో వీటిని కేవలం 60 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, ఇంటి వద్ద ఉండే సాధారణ హోమ్ ఛార్జర్ ద్వారా అయితే, 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్ పాడ్ హెడ్ల్యాంప్లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, సన్రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, పుష్ బటన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్ వంటి పలు ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఆగస్ట్ 31 న కొత్త Tata Tigor EV లాంచ్
Tata Motors ఇటీవలే తమ సరికొత్త Tigor EV ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఆగస్టు 31, 2021వ తేదీన కంపెనీ ఈ కారును దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్లను స్వీకరించడం కూడా ప్రారంభించింది.
కొత్త Tata Tigor EV ఎలక్ట్రిక్ కారు పట్ల ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కంపెనీ తమ పాపులర్ Nexon EV ని తయారు చేసిన Ziptron ప్లాట్ఫామ్ పైనే ఈ కొత్త Tigor EV ని కూడా తయారు చేసింది. ఫలితంగా, ఇది మునుపటి మోడల్తో పోలిస్తే చాలా మెరుగైన రేంజ్ను ఆఫర్ చేస్తుంది.
Tata Motors తమ ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారుల కోసం దేశవ్యాప్తంగా పబ్లిక్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే Tata Power సంస్థతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఇరు సంస్థలు భారీగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి.