Just In
- 2 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 3 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 3 hrs ago ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!.. ధర ఎంతో తెలుసా?
- 5 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
Don't Miss
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
భారత మార్కెట్లో ఈ టాప్ 5 కార్లు నిలిపివేయబడ్డాయి.. ఎందుకో తెలుసా?
భారత ఆటో మొబైల్ పరిశ్రమలో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఎందుకంటే వాహనదారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే గత కొన్నేళ్లుగా, కార్ల తయారీదారులందరూ తమ అప్డేట్ చేసిన అనేక కార్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు.
ఇదిలా ఉండగా కొంతమంది కార్ల తయారీదారులు తమ బ్రాండ్ యొక్క కొన్ని కార్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. గత 5 సంవత్సరాలుగా మార్కెట్లో అమ్మకాలు ఆగిపోయిన టాప్ 5 కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
మారుతి సుజుకి రిట్జ్:
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన కంపెనీలలో ఒకటి. అయితే ఈ కంపెనీకి చెందిన మారుతి సుజుకి రిట్జ్ మాత్రం సరిగ్గా అమ్ముడుపోలేదు. కంపెనీ ఈ మారుతి సుజుకి రిట్జ్ కారుని 2009 లో ప్రారంభించింది. ఈ కారు అత్యంత చౌకైన కారు అయినప్పటికీ ఆశించిన అమ్మకాలతో ముందుకు సాగలేకపోయింది.
MOST READ:జెసిబి వల్ల బయటపడిన బీచ్లో చిక్కుకున్న థార్[వీడియో]
మారుతి సుజుకి రిట్జ్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఈ కారణంగా ఆ తర్వాత ఈ కారును ఫిబ్రవరి 2017 లో నిలిపివేశారు. ఈ కారు నిలిపివేయబడింది తరువాత ప్రత్యామ్నాయంగా మారుతి ఇగ్నిస్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
మారుతి ఆల్టో కె 10:
మారుతి కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టిన కార్లలో మారుతి ఆల్టో ఒకటి. ఇది విడుదలైన ప్రారంభదశలో బాగా అమ్ముడైంది. కానీ కాలక్రమంలో దీనికున్న ఆదరణ తగ్గిపోయింది. కంపెనీ దీనిని 2010 ఆగస్టులో మొదటిసారిగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే అంటే 2020 ఏప్రిల్లో అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది.
MOST READ:అక్కడ కరోనా లాక్డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు
మారుతి జిప్సీ:
మారుతి సుజుకి కంపెనీ 1985 డిసెంబరులో భారత మార్కెట్లో జిప్సీ కారుని ప్రారంభించింది. మారుతి జిప్సీ విడుదలైనప్పటినుంచి మంచి ప్రజాదరణపొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు వెళ్ళింది.
అయితే దేశీయ మార్కెట్లో వాహనాలు తప్పనిసరిగా బిఎస్ 6ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడాల్సి ఉంది, కానీ ఈ కారు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాల అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు ఈ కారణంగా 2019 మార్చిలో మారుతి సుజుకి జిప్సీ పూర్తిగా నిలిపివేయబడింది.
MOST READ:నదిలో చెత్తవేసిన మహిళకు సరైన గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఇంతకీ ఏం చేసారంటే?
టయోటా కొరోల్లా ఆల్టిస్:
టయోటా కొరోల్లా ఆల్టిస్ అనేది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు. కానీ కంపెనీ ఈ టయోటా కొరోల్లా ఆల్టిస్ ను తక్కుగా ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే భారత మార్కెట్లో ఆశించిన అమ్మకాలు సాగించలేకపోయింది. కొరోల్లాను ఫిబ్రవరి 2003 లో భారతదేశంలో ప్రవేశపెట్టారు, కాని సెప్టెంబర్ 2008 లో దీనిని కొరోల్లా ఆల్టిస్ గా మార్చారు. తరువాతి కాలంలో ఇది నిలిచిపోయింది.
హోండా సివిక్:
హోండా కంపెనీ మొదటిసారిగా 2006 జూలైలో సివిక్ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కాని విడుదలైన అతితక్కువ కాలంలోనే అంటే 2012 ఆగస్టులో కారు అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయింది. అయితే తిరిగి ఇది 2019 లో భారత మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టబడింది.
MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
2019 తిరిగి ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇది మార్కెట్లో ఆశించిన విజయం సాధించలేకపోయింది.హోండా కార్స్ ఇండియా తన గ్రేటర్ నోయిడా ప్లాంట్ను మూసివేసిన తరువాత 2020 డిసెంబర్లో హోండా సివిక్ సెడాన్ అమ్మకాన్ని మరోసారి మూసివేసింది.