Just In
- 8 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 10 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 12 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 15 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!
కేంద్ర ప్రభుత్వం నిన్న 2021 మరియు 2022 బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విడుదల చేశారు. ఈ బడ్జెట్లో ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలు, ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమపై ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రకటించబడ్డాయి. ఈ ప్రాజెక్టులలో పాత వాహనాలను నాశనం చేసే ప్రణాళిక కూడా ఉంది.
ఈ ప్రాజెక్టు ప్రకారం ప్రమాదంలో చిక్కుకుని, ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే 20 ఏళ్ల వయసుపైబడిన వ్యక్తిగత వాహనాలు మరియు 15 సంవత్సరాల వయస్సు పైబడిన కమర్షియల్ వాహనాలు పూర్తిగా నిషేదించబడతాయి. కావున ఈ వాహనాలు ఉపయోగంలో ఉండవు.
MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి
అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్త వాహనాల అమ్మకాలను పెంచడానికి కొత్త వాహన సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా కొత్త సంస్థలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. భారతదేశంలో చాలా మంది కార్ల తయారీదారులు ఆటోమొబైల్స్ నుండి ప్రధాన భాగాలను దిగుమతి చేసుకుంటారు. వీటిని భారతదేశంలో సమీకరించి విక్రయిస్తారు.
ఈ విధంగా దిగుమతి చేసుకునే కొన్ని ప్రధాన కార్ ఉపకరణాలకు 15% కస్టమ్స్ టాక్స్ వసూలు చేస్తారు. ఇది భారతదేశంలో కార్ల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల దాదాపు అన్ని వాహనతయారీదారులు తమ వాహనాల ధరలు గణనీయంగా పెంచడం జరిగింది.
MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి
చాలా లగ్జరీ కార్ మోడల్స్ భారతదేశంలో అమ్ముడవుతున్నందున ఈ కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో 2021 మరియు 2022 కేంద్ర బడ్జెట్ వాహనాల తయారీలో ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్ పై కస్టమ్స్ టాక్స్ 7.5% తగ్గించింది.
ఇది కార్ల తయారీదారులకు ఉత్పత్తి ఖర్చులను తగ్గించటానికి వీలు కల్పించింది. అంతే కాకుండా రాబోయే కాలంలో కారు ధరలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తుంది. భారతదేశంలో పెట్రోల్ మరియు డీజల్ వాహనాల వాడకాన్ని బాగా తగ్గించడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని కేంద్ర కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది.
MOST READ:వావ్.. ల్యాండ్రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి
ఈ నేపథ్యంలో భాగంగానే కేంద్ర కూడా చాలా డిస్కౌంట్ ప్రకటిస్తోంది. అది మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి, దేశ వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వినియోగించే సూచనలు కనిపిస్తున్నాయి.