ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో పర్యావరణ అనుకూల వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2015 లో FAME స్కీమ్ ప్రారంభించింది. ఇప్పుడు, ఫేమ్-2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రూ. 212.31 కోట్లు విడుదల చేయడానికి అనుమతి లభించింది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ఫేమ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలను దేశంలో విక్రయించి ఉత్పత్తి చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఫేమ్ 2 స్కీమ్ కింద దేశంలోని 65 నగరాల్లో దాదాపు 5,565 ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి రానున్నాయి. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 15 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ఈ బస్సులు ఇంటర్ సిటీ, ట్రైన్ మరియు మెట్రో స్టేషన్లను అందించబడతాయి. ఈ ప్రాజెక్టు కోసం 5,565 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి రూ. 212.31 కోట్ల నిధులు విడుదల చేయబడతాయి. స్మార్ట్ సిటీ నిర్మాణానికి రవాణా వనరులను చేకూర్చడం కూడా అవసరమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి, ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి రానున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఎలక్ట్రిక్ వాహనాల రాకపోకలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫేమ్-2 ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

FAME స్కీమ్ కింద, ప్రతి స్మార్ట్ సిటీలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు అభివృద్ధి కోసం భారీ పరిశ్రమ మరియు ప్రభుత్వ సంస్థల విభాగం 2015 ఏప్రిల్‌లో ఫేమ్ ప్రాజెక్టును ప్రారంభించింది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి సంబంధించిన నియమాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెంచడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడం మరియు సాంకేతిక సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ఫేమ్ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ రెండు సంవత్సరాల కాలానికి 2015 ఏప్రిల్‌లో అమలు చేయబడింది. ఈ ప్రణాళిక తరువాత చాలాసార్లు విస్తరించబడింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2019 మార్చి 31 న పూర్తయింది. ఫేమ్-2 ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడం మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై టాక్స్ తగ్గించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాలకు జీఎస్టీలో 5%, పెట్రోల్ డీజిల్ వాహనాలకు జీఎస్టీలో 28% వసూలు చేస్తారు. 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు, 7,000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం యొక్క విధివిధానాల ప్రకారం 2030 నాటికి 100% ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించాలన్నది ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం పెరిగినట్లైతే ఇంధన వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా కాలుష్యం కూడా దాదాపుగా తగ్గించడానికి వీలుగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 10, 2021, 15:15 [IST]
English summary
Union Government Releases More Than 200 Crore Rupees To Purchase Electric Buses. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+