Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి
భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల, ఇంధనంతో కలిపే ఇథనాల్ పరిమాణాన్ని మరింత పెంచే నిర్ణయం తీసుకున్నారు. గతంలో 90% ఇంధనంలో 10% ఇథనాల్ కలిపారు. ఇప్పుడు ఈ రేటును 20% కి పెంచారు.
ఇది వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విడుదల చేసిన 2021-2022 బడ్జెట్లో పాత వాహన స్క్రాపింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో 15 ఏళ్ల కమర్షియల్ మరియు 20 ఏళ్ల ప్రైవేట్ వాహనాలు కొత్త నిబంధన ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి. ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన వాహనాలు జరిమానాతో పాటు జప్తు చేయబడే అవకాశం ఉంది.
ఈ చర్యలు తీసుకునే ముందు పాత వాహనాలను స్క్రాప్ చేయాలని సూచించారు. వాణిజ్య మరియు పాత ప్రైవేట్ వాహనాల యజమానులు కేంద్ర ప్రభుత్వం కొత్త స్క్రాపింగ్ విధానం వల్ల కలత చెందుతున్నారు. 15 ఏళ్లకు మించని ప్రభుత్వ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర రహదారి రవాణా, రహదారుల విభాగం తన కొత్త ఆర్డినెన్స్లో పేర్కొంది.
ఈ ఉత్తర్వు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక ప్రభుత్వ విభాగాలు మరియు స్వయంప్రతిపత్త ప్రభుత్వ సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలకు వర్తిస్తుందని రహదారి రవాణా మరియు రహదారుల శాఖ తెలిపింది.
కొత్త స్క్రాపింగ్ విధానం ప్రకారం ప్రభుత్వ విభాగాలలో వాడుకలో ఉన్న 15 సంవత్సరాల వాహనాలకు సమస్యలను తెచ్చిపెట్టింది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని ఆ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇది 15 సంవత్సరాల ప్రభుత్వ వాహనాలకు ఇకపై తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తుంది.
MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?
వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర రవాణా శాఖ ఈ విధమైన చర్యలు తీసుకుంది. భారతదేశంలో మొత్తం దేశవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా పాత వాహనాలు వాడుకలో ఉన్నాయి. వీటిలో పోలీసు వ్యాన్లు, పోస్ట్ వ్యాన్లు, రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, అంబులెన్సులు ఉన్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి స్క్రాపింగ్ విధానాన్ని అమలు చేయడం మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేసి వారికి రోడ్ టాక్స్ వంటి వాటిని తొలగించడం మరియు కొత్త సబ్జిడీలు అందించడం వంటివి చేస్తోంది.
MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ సదుపాయాల వల్ల చాలామంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మొగ్గుచూపుతున్నారు. అంతే కాకుండా దీనికి అనుగుణంగా వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు.