ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల, ఇంధనంతో కలిపే ఇథనాల్ పరిమాణాన్ని మరింత పెంచే నిర్ణయం తీసుకున్నారు. గతంలో 90% ఇంధనంలో 10% ఇథనాల్ కలిపారు. ఇప్పుడు ఈ రేటును 20% కి పెంచారు.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

ఇది వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విడుదల చేసిన 2021-2022 బడ్జెట్‌లో పాత వాహన స్క్రాపింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో 15 ఏళ్ల కమర్షియల్ మరియు 20 ఏళ్ల ప్రైవేట్ వాహనాలు కొత్త నిబంధన ప్రకారం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలి. ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైన వాహనాలు జరిమానాతో పాటు జప్తు చేయబడే అవకాశం ఉంది.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

ఈ చర్యలు తీసుకునే ముందు పాత వాహనాలను స్క్రాప్ చేయాలని సూచించారు. వాణిజ్య మరియు పాత ప్రైవేట్ వాహనాల యజమానులు కేంద్ర ప్రభుత్వం కొత్త స్క్రాపింగ్ విధానం వల్ల కలత చెందుతున్నారు. 15 ఏళ్లకు మించని ప్రభుత్వ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర రహదారి రవాణా, రహదారుల విభాగం తన కొత్త ఆర్డినెన్స్‌లో పేర్కొంది.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

ఈ ఉత్తర్వు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక ప్రభుత్వ విభాగాలు మరియు స్వయంప్రతిపత్త ప్రభుత్వ సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలకు వర్తిస్తుందని రహదారి రవాణా మరియు రహదారుల శాఖ తెలిపింది.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

కొత్త స్క్రాపింగ్ విధానం ప్రకారం ప్రభుత్వ విభాగాలలో వాడుకలో ఉన్న 15 సంవత్సరాల వాహనాలకు సమస్యలను తెచ్చిపెట్టింది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని ఆ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇది 15 సంవత్సరాల ప్రభుత్వ వాహనాలకు ఇకపై తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తుంది.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర రవాణా శాఖ ఈ విధమైన చర్యలు తీసుకుంది. భారతదేశంలో మొత్తం దేశవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా పాత వాహనాలు వాడుకలో ఉన్నాయి. వీటిలో పోలీసు వ్యాన్లు, పోస్ట్ వ్యాన్లు, రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, అంబులెన్సులు ఉన్నాయి.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి స్క్రాపింగ్ విధానాన్ని అమలు చేయడం మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేసి వారికి రోడ్ టాక్స్ వంటి వాటిని తొలగించడం మరియు కొత్త సబ్జిడీలు అందించడం వంటివి చేస్తోంది.

ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ సదుపాయాల వల్ల చాలామంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మొగ్గుచూపుతున్నారు. అంతే కాకుండా దీనికి అనుగుణంగా వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, March 15, 2021, 9:57 [IST]
English summary
Union Transport Ministry Says No Re Registration Of 15 Years Old Government Vehicles. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+