మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇప్పుడు పూర్తిగా తమ స్వంత యాజమాన్యంలో ఉండే ఓ అనుబంధ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈవీ కో (EV Co.) ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహీంద్రా సంస్థ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ (British International Investment) తో కలిసి ఈవీ కో సంస్థలో రూ. 1,925 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొత్త మహీంద్రా సబ్-బ్రాండ్ ఈవీ కో నుండి మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (BII) మరియు మహీంద్రా ద్వారా కొత్తగా విలీనం చేయబడే ఈవీ కో (EV Co) లో ఇరు కంపెనీలు తమ పెట్టుబడిని పెట్టనున్నాయి. బిఐఐ మరియు మహీంద్రా సంతకం చేసిన ఒప్పందం ప్రకారం, బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ రూ.70,070 కోట్ల వాల్యుయేషన్ వద్ద, రూ. 1,925 కోట్ల వరకు నిర్బంధ కన్వర్టిబుల్ సాధనాల రూపంలో పెట్టుబడి పెట్టనుంది. ఈవీకో లో బిఐఐ పెట్టుబడి యూకే యొక్క డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌ను చూస్తుంది మరియు మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలో 2.75 శాతం నుండి 4.76 శాతం వరకు ఇంపాక్ట్ ఇన్వెస్టర్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

ఈవీ కో మహీంద్రా యొక్క ఫోర్-వీల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతుందని కంపెనీ పేర్కొంది. రాబోయే 2023-24 మరియు 2026-27 ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఈ కొత్త కంపెనీకి మొత్తం మూలధనం దాదాపు రూ. 8,000 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. మహీంద్రా ఇటీవలే తమ బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్ క్రింద మూడు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది మరియు వాటికి సంబంధించిన కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

ఈ నేపథ్యంలో, మహీంద్రా యొక్క మొదటి కొత్త వాహనం ఈవీ కో సబ్-బ్రాండ్ నుండి రావచ్చని భావిస్తున్నారు. మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ శ్రేణి ఎస్‌యూవీలను కంపెనీ ఆగస్టు 15న ఆవిష్కరించనుంది. వీటి తర్వాత సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 (XUV400) ఎస్‌యూవీ ఆవిష్కరించబడుతుంది.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థ ఈవీ కో మరియు బిఐఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ డాక్టర్ అనీష్ షా మాట్లాడుతూ "మా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రయాణంలో భాగంగా బిఐఐతో భాగస్వామిగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. బిఐఐ క్లైమేట్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి కట్టుబడి ఉండే ఆలోచనలను కలిగి ఉన్న దీర్ఘ-కాల భాగస్వామి. మహీంద్రా గ్రూప్ 2040 నాటికి ప్లానెట్ పాజిటివ్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా ఉంది మరియు మేము భవిష్యత్తులో కూడా అగ్రగామిగా ఉంటామని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

ఈ డీల్ గురించి బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (బిఐఐ) సిఈఓ డోనోహో మాట్లాడుతూ: "మహీంద్రా గ్రూప్‌తో ఈ ఉత్తేజకరమైన వెంచర్‌లోకి ప్రైవేట్ మూలధనం యొక్క అదనపు వనరులను ఆకర్షించడానికి బిఐఐ యొక్క పెట్టుబడి చాలా కీలకమైనది. భారతదేశంలో ఈవీ అభివృద్ధిని వేగవంతం చేయడం దేశానికి మద్దతు ఇవ్వడం ఎంతో అవసరం. అనేక పట్టణ ప్రాంతాలలో దాని ఉద్గార లక్ష్యాలను చేరుకోవడంతోపాటు గాలి నాణ్యతను మెరుగుపరచడంలో మహీంద్రా ఇండియా మరియు ఇతర ప్రాంతాలలో ఆటోమోటివ్ పరిశ్రమ యొక్క డీకార్బనైజేషన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుందని" చెప్పారు.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

అలాగే, ఈ ఒప్పందం గురించి బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్ట్ ప్రైవేట్ ఈక్విటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్ సమీర్ అభ్యంకర్ మాట్లాడుతూ "వాతావరణ మార్పు అనేది ప్రస్తుతం అతిపెద్ద సవాళ్లలో ఒకటి. మహీంద్రా యొక్క ఈవీ వ్యాపారంలో పెట్టుబడి మా డీకార్బనైజేషన్ వ్యూహం మరియు స్థిరమైన వ్యాపారానికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టింది. ఇది కొత్త ఉద్యోగాలను (ప్రత్యేకించి మహిళల కోసం) సృష్టిస్తుంది. మహీంద్రా యొక్క ఈవీ వ్యూహం మరియు బలమైన ఆశయాన్ని అమలు చేయడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనాపరులైన ఇతర పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడానికి మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.

మహీంద్రా నుండి కొత్త అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈవీ కో (EV Co) ఏర్పాటు, త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!

ఇదిలా ఉంటే, మహీంద్రా బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 'మహీంద్రా స్కార్పియో-ఎన్‌' (Mahindra Scorpio-N) కోసం ఇప్పుడు టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభమయ్యాయి. దేశంలోని కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ ఎస్‌యూవీ కోసం టెస్ట్ డ్రై‌వ్‌లు మరియు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం, దేశంలోని 30 ప్రధాన నగరాల్లో మాత్రమే టెస్ట్ డ్రైవ్‌లు జరుగుతుండగా, జులై 15 నుంచి దేశంలోని మరిన్ని ఇతర నగరాల్లో ఈ టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభం కానున్నాయి. దేశీయ విపణిలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్‌ ధరలు రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. అయితే, ఈ పరిచయ ధరలు మొదటి 25,000 మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Article Published On: Monday, July 11, 2022, 13:18 [IST]
English summary
Mahindra and british international investment join hands to set up ev co electric vehicle company
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+