Just In
- 35 min ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 3 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 3 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 4 hrs ago ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
వెనుక సీటులో కూర్చుని కూడా సీట్ బెల్ట్ ధరించడం లేదా..? అయితే, మీ జేబులో రూ.1000 సిద్ధంగా ఉంచుకోండి..!
కారులో వెనుక సీటులో కూర్చుని సీట్ బెల్ట్ (Rear Passenger Seat Belt) పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నారా..? అయితే, మీ జేబులో ఎల్లప్పుడూ వెయ్యి రూపాయలను సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే, అది కారులో వెనుక సీట్లలో కూర్చుని, సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి విధించే జరిమానా మొత్తం.
Recommended Video
గడచిన సెప్టెంబరు 4వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీటులో కూర్చుని, సీట్ బెల్ట్ ధరించని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసినదే. ఆయన మరణం తర్వాత చాలా మందిలో చలనం వచ్చింది మరియు కారులో సీట్ బెల్ట్ యొక్క ఆవశ్యకత గురించి అర్థమైంది. ప్రభుత్వం, కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే, ఇప్పుడు కారులో అన్ని సీట్లలో సీట్ బెల్ట్ నిబంధనను తప్పనిసరి చేసింది.
వాస్తవానికి కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ తప్పనిసరిగా సీట్ బెల్టులను ధరించాలనే నిబంధన మనదేశంలో ఉంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR) ప్రకారం, కారులో కూర్చున్నప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సిఎమ్విఆర్ యొక్క రూల్ 138 (3) ప్రకారం, వాహనం కదులుతున్నప్పుడు "ముందు సీటులో కూర్చున్న వ్యక్తులు లేదా వెనుక సీట్లలో కూర్చున్న వ్యక్తులు తప్పనిసరిగా సీటు బెల్ట్లను ధరించాలి". సీటు బెల్ట్ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.1,000 జరిమానా విధించేలా ప్రభుత్వం మోటారు వాహనాల నిబంధనలలో ఒక నిబంధనను తెచ్చింది.
మొన్నటి వరకూ ఈ నిబంధన ముందు సీట్లలోని ప్రయాణీకులకు మాత్రమే తప్పనిసరిగా ఉండేది. అయితే, ఇప్పుడు ఈ నిబంధన వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులకు కూడా తప్పనిసరిగా వర్తించనుంది. రహదారి భద్రతా నియమాలను తీవ్రతరం చేసే ప్రయత్నంలో భాగంగా, వెనుక సీట్లలోని ప్రయాణీకులు కూడా సీట్ బెల్ట్లను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు, ఈ నిబంధన పాటించని వారిపై రూ.1,000 జరిమానా విధిస్తామని చెప్పారు.
కార్లలో భద్రత మరియు సీట్ బెల్టు నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ అనూహ్యంగా మరణించినప్పటి నుండి, నాలుగు చక్రాల వాహనాలలో వెనుక సీటు ప్రయాణికుల భద్రతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో టాటా సన్స్ మాజీ చైర్మన్ మిస్త్రీ వెనుక సీటులో కూర్చొని సీటు బెల్ట్ ధరించకపోవడంతో వేగంగా వెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు జహంగీర్ పండోల్ అనేక వ్యక్తి కూడా మరణించారు. కాగా, సీట్ బెల్టుల కోసం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా మొదటి రోజు సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలోని బరాఖంబా రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మొదటి రోజు, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం 17 చలాన్లు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించారు.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194బి (సేఫ్టీ బెల్ట్లు మరియు పిల్లల సీటింగ్ల వాడకం) కింద ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ సమయంలో మొత్తం 17 కోర్టు చలాన్లు జారీ చేయబడ్డాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సీటు బెల్ట్ ధరించడం (ముఖ్యంగా) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గత వారం, ఢిల్లీ పోలీసులు ట్విటర్లో పౌరులను కోరుతూ, ఓవర్ స్పీడ్ చేయవద్దని మరియు ఎల్లప్పుడూ సీటు బెల్ట్లను ధరించాలని కోరారు.
ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, వెనుక సీటు ప్రయాణికులు తప్పనిసరిగా సీటుబెల్ట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, ప్రజలు ఈ పద్ధతిని పాటించడం లేదని, ఇకపై ఈ విషయంలో ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించబడుతుందని గడ్కరీ చెప్పారు. అంతేకాకుండా, వాహన తయారీదారులు కూడా వెనుక సీట్లలోని సీట్ బెల్ట్ లకు తప్పనిసరిగా అలారం సిస్టమ్ను ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరి చేయాలని ఆయన చెప్పారు.
సాధారంణంగా, కారులో ప్రయాణించే చాలా మంది ముందు సీట్ల కన్నా వెనుక సీట్లు చాలా సురక్షితమని భ్రమ పడుతుంటారు. అందుకే, వెనుక సీట్లలో సీట్ బెల్ట్ సౌకర్యం ఉన్నా, వాటిని ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేగంగా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనప్పుడు వెనుక సీటులో సీట్ బెల్ట్ ధరించకుండా కూర్చున్న వ్యక్తి కొన్నిసార్లు 40G శక్తితో (40 రెట్లు గురుత్వాకర్షణ, అంటే సుమారు 80 కేజీల బరువున్న వ్యక్తి 3200 కేజీల బరువున్న వ్యక్తిలా) విసిరివేయబడతాడు. అంటే, ప్రమాద తీవ్రత ఎంతలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
అధికారిక సమాచారం ప్రకారం, గత ఏడాది ఢిల్లీలో డ్రైవర్లు లేదా వాహనాల ప్రయాణీకుల నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1,900 మందికి పైగా మరణించారు. సీటు బెల్టులు ధరించకపోవడం, సరైన రీతిలో పార్కింగ్ చేయకపోవడం, రెడ్ లైట్లను దూకడం, అతివేగంగా నడపడం వంటి నేరాలకు పాల్పడిన నేరస్థులకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు గతేడాది 1.2 కోట్ల మందికి పైగా నోటీసులు జారీ చేశారు. త్వరలోనే దేశంలో మరిన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి.