Tata Motors Sales భారీగా పెరిగిన టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్.. ఈ కార్లనే ఎక్కువగా కొంటున్నారు..

టాటా మోటార్స్ భారతదేశంలోనే కార్ల తయారీదారుల్లో పేరుగాంచిన ప్రముఖ వాహన సంస్థగా కొనసాగుతోంది. ఈ సంస్థ ఏప్రిల్ లో మొత్తం అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీ సేల్స్‌తో తన సత్తాను చాటింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం..

గత నెలలో (ఏప్రిల్ 2023) భారత మార్కెట్లో మొత్తం 68,514 (ప్యాసింజర్, కమర్షియల్) యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు టాటా వెల్లడించింది. ఏప్రిల్ 2022 (71,467 యూనిట్లు)తో పోలిస్తే 4% క్షీణతను కనబర్చినట్లు సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాల్లో మాత్రం 179 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 ఏప్రిల్లో కంపెనీ 6,516 యూనిట్లను విక్రయించింది.

tata nexon

2022 ఏప్రిల్లో కేవలం 2,333 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించింది. మార్చి (2023)లో 6,506 యూనిట్లను విక్రయించింది. టాటా ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి కారణం పాపులర్ అయినా టియాగో ఈవీ, నెక్సాన్ ప్రైమ్, నెక్సాన్ మ్యాక్స్ ఈవీలను పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధించింది.

టాటా ఎలక్ట్రిక్ కార్ల గురించి కొన్ని వివరాలను పరిశీలిస్తే, అత్యంత సరసమైన టియాగో ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ .8.69 - 11.99 లక్షల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో సహా రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. టియాగో ఈవీ 315 కిలోమీటర్లు, 19.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది.

tata tiago

డిసి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లో, కారు బ్యాటరీ కేవలం 57 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటో ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఏబీఎస్, ఈబీడీ, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి.

టాటా నెక్సాన్ ప్రైమ్ మరియు నెక్సాన్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లో విక్రయిస్తుంది. నెక్సాన్ ప్రైమ్ ధర రూ.14.49 లక్షల నుంచి రూ.17.19 లక్షల మధ్యలో, నెక్సాన్ మ్యాక్స్ ధర రూ.16.49 లక్షల నుంచి రూ.19.54 లక్షల మధ్యలో ఉండనుంది. నెక్సాన్ ప్రైమ్ 30.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది, ఫుల్ ఛార్జ్ 312 కిలోమీటర్ల పరిధితో నెక్సాన్ మ్యాక్స్ 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ను పొందుతుంది.

టాటా మోటార్స్ 2023 ఏప్రిల్లో భారత మార్కెట్లో 47,007 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది, ఇది సంవత్సరానికి 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఏప్రిల్లో 41,587 యూనిట్లను విక్రయించింది. గత నెలలో 22,492 యూనిట్లను (2022 ఏప్రిల్లో 30,838 యూనిట్లు) విక్రయించడంతో కంపెనీ వాణిజ్య వాహనాల అమ్మకాల్లో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది, ఇది 27 శాతం క్షీణించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 2, 2023, 19:01 [IST]
English summary
Tata motors ev sales increased in april details in telugu
Read more on: #కార్లు #cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+