40 కి.మీల మైలేజ్తో బైక్లతో పోటీగా.. త్వరలో మార్కెట్లోకి రానున్న సూపర్ మారుతి కార్లు ఇవే..
దేశంలో అతిపెద్ద ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో అమ్మకాల ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మూడు దశాబ్దాలుగా ప్రతి నెలవారీ ప్యాసింజర్ కార్ల విక్రయాల చార్ట్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్లుగా మారుతి సుజుకి బ్రాండ్లు నిలిచాయి.
ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి తన కార్ల లైనప్ను మరింతగా విస్తరించేందుకు యోచిస్తోంది. ఇది ఇండియన్ మార్కెట్లో కొత్త కార్లతో తన పరిధిలోని ప్రముఖ కార్లను అప్డేట్ చేస్తోంది. ఈ క్రమంలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న కార్ల గురించిన పూర్తి సమాచారం ఈ కథనంలో మీకు అందిస్తున్నాం.

న్యూ జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ కలిగి ఉంటుంది. ఈ కారును ఇప్పటికే విదేశాల్లో పలుమార్లు పరీక్షించారు. ఇది ఈ సంవత్సరం చివరిలో లేదా 2024 ప్రారంభంలో జపాన్లో గ్లోబల్ అరంగేట్రం చేయనుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ కారు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ శ్రేణిలో 1.2 లీటర్ మూడు సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది. ఈ కారు మిడ్-స్పెక్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న గ్యాసోలిన్ ఇంజిన్ను కొనసాగించవచ్చు. ఈ ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్బాక్స్ మరియు ఐదు-స్పీడ్ AMT గేర్బాక్స్తో జత చేయబడింది.

న్యూ జెన్ మారుతి డిజైర్: స్విఫ్ట్ మాదిరిగానే, కొత్త తరం డిజైర్ కూడా లోపల మరియు వెలుపల ఒక పెద్ద ఫేస్లిఫ్ట్ను పొందుతుంది. ఇది దాని హ్యాచ్బ్యాక్ మోడల్తో సారూప్యతను కలిగి ఉంది. మూడవ తరం మారుతి సుజుకి డిజైర్ 2024 ద్వితీయార్థంలో విడుదల కానుంది. ఇది 2024 స్విఫ్ట్లో ప్రారంభమయ్యే అదే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ను కలిగి ఉండనుంది.
ఈ రెండు కార్లలో, కొత్త ఫీచర్లు మరియు టెక్నాలజీల జోడింపుతో ఇంటీరియర్ మరింత ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది. అన్నింటికంటే, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 35-40 kmpl మైలేజీని అందించగలదు. ఈ కారు మంచి మైలేజీని ఇస్తుంది. ఈ రెండు కార్లు చాలా మంది కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

మారుతీ సుజుకి EVX: పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశంలోనే నంబర్ 1 కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంతి మొదటి ఎలక్ట్రిక్ వాహనం అక్టోబర్ 2025లో ప్రారంభం కానుంది. ఇది టయోటా యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుంది.
మారుతి సుజుకి EVX తర్వాత టయోటా-బ్యాడ్జ్డ్ వెర్షన్ త్వరలో వస్తుందని భావిస్తున్నారు. EVX ఎలక్ట్రిక్ SUV యొక్క రెండు వెర్షన్లు గుజరాత్లోని సుజుకి ఫెసిలిటీలో తయారు కానున్నాయి. ప్రస్తుతం సుజుకి వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు, గుజరాత్లోని ప్లాంట్ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు ఉపయోగించబడుతుంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








