New Gen Maruti Dzire భారత్లో తొలిసారిగా మారుతి కొత్త కారు ట్రయల్ రన్.. స్పై ఫొటోలు వైరల్
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో మారుతి సుజుకి(Maruti Suzuki) ఒకటి. కాగా మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవతున్న కార్లలో డిజైర్ ముందుటుంది. ఈ క్రమంలో మారుతి సుజుకి ఈ కారు మోడల్ యొక్క మూడవ తరం(Third Gen Maruti Dzire) వెర్షన్ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇటీవల మారుతి సుజుకి మూడవ తరం డిజైర్ యొక్క ట్రయల్ రన్ను భారత్లో ప్రారంభించింది. ఈ క్రమంలో టెస్ట్ రన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ కారు టెస్ట్ రన్ స్పై ఫొటోలు బయటకు రావడం ఇదే తొలిసారి. ఈ కారణంగానే కార్ ప్రియుల్లో.. డిజైర్ మూడవ తరం ఫొటోలు ఆసక్తిని పెంచాయి.

టెస్ట్ రన్ స్పై ఫొటోల ద్వారా కొత్త తరం డిజైర్ గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. డిజైన్(New Gen Maruti Dzire)కు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. కారు ముందు భాగంలో పెద్ద వృత్తాకార గ్రిల్ మరియు అప్డేటెడ్ బంపర్ను చూడవచ్చు. ఇది కాకుండా, కొత్త LED లైట్ సెటప్ను ఆకర్షణీయంగా ఇందులో అమర్చారు.
కొత్త తరం మారుతి డిజైర్(Third Gen Maruti Dzire Design)లో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, కెమెరాతో కూడిన ORVM తో వస్తుంది. ఇది 360 డిగ్రీల కెమెరా ఫీచర్ను కలిగి ఉంది. మూడవ తరం డిజైర్లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, డిజైర్ ఎక్స్టీరియర్తో పాటు ఇతర అంశాలు ప్రత్యేకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కాకుండా, ఇంటీరియర్ పరంగా కొత్త తరం డిజైర్లో ఆకర్షణీయమైన అధునాతన ఫీచర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారులో పెద్ద స్క్రీన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 9 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే కొత్త తరం మారుతి డిజైర్లో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్తో పనిచేయవచ్చని తెలుస్తోంది.

కాగా జపాన్లో విక్రయించే కొత్త స్విఫ్ట్ కారులోనూ ఇదే ఇంజిన్ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 82 PS శక్తిని మరియు 108 Nm టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, ఈ మోటారుతో 5-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో జత చేయబడి ఉంటాయి.
కొత్త తరం మారుతి డిజైర్ ఆకర్షణీయమైన ఫీచర్లు, సరికొత్త అప్డేట్లతో రానుంది. అయితే ఈ కారు ఎప్పటి నుంచి విక్రయానికి వస్తుందో సమాచారం అందుబాటులో లేదు. త్వరలోనే మార్కెట్లోకి విడుదల అవుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కారు ట్రయల్ రన్లు జరుగుతున్నాయి.

కాగా మూడవ తరం మారుతి డిజైర్ అధిక మైలేజీని అందిస్తుందని తెలుస్తోంది. ఇది లీటర్కు 25 కి.మీ నుంచి 30 కి.మీ మైలేజీని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, మారుతీ సుజుకీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా డిజైర్ కారు మోడల్పై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ దశలోనే మారుతి సుజుకి హైబ్రిడ్ ఫీచర్లతో కొత్త తరాన్ని విడుదల చేసే పనిలో పడింది.


Click it and Unblock the Notifications








