రేపే నిస్సాన్ కొత్త 7 సీటర్ ఎస్యూవీ విడుదల.. ఫార్చ్యూనర్కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధం!
భారత మార్కెట్లో 7-సీటర్ ఫ్యామిలీ ఎస్యూవీ నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail) రేపు (01-08-2024) అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు మాగ్నైట్ అనే బడ్జెట్ మోడల్తో దేశంలో ఉన్న నిస్సాన్ రేపటి నుంచి ఎక్స్-ట్రైల్తో భారతీయ మార్కెట్లో మరోసారి తన శక్తిని నిరూపించుకోనుంది. ఇది పూర్తిగా విదేశాల్లో తయారు చేసి దిగుమతి చేసుకోవడంతో ధరపై కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన ఈ వాహనానికి భారీ స్పందన లభిస్తోందని తెలిసింది.
ఆసక్తిగల కస్టమర్లు రూ .1 లక్ష టోకెన్ మొత్తాన్ని చెల్లించి త్రీ స్టెప్స్ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 1 న ధర ప్రకటన తర్వాత ఈ మోడల్ డెలివరీ కూడా వీలైనంత త్వరగా ప్రారంభమవుతుంది. ఎక్స్-ట్రైల్ ఒక దశాబ్దం క్రితం భారత్లో తిరిగి ఈ మోడల్ని ప్రవేశపెడుతుంది. అంటే దాదాపు 10 సంవత్సరాల విరామం తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకోనుంది అన్నమాట.

తాజా ఎక్స్-ట్రైల్ ఎస్యూవీని పెద్ద ఫ్యామిలీ ఎస్యూవీగా మార్పు చేసింది. దీని సెగ్మెంట్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు రూ. 40 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ధర అందుబాటులోకి తెస్తే సుమారు రూ .30 లక్షల వద్ద పరిచయం చేస్తే టయోటా ఫార్చ్యూనర్కి గట్టి పోటీని ఇవ్వగలదు. ఎందుకంటే ఇది ఈ మోడల్ని టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి వస్తుంది
కొత్త తరం మోడల్ ఎస్యూవీని సింగిల్ వేరియంట్ ఆప్షన్లో ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే నిస్సాన్ కూడా ఈ ఎస్యూవీని స్థానికంగా తయారు చేసే అవకాశం ఉంది. డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇందులో LED హెడ్ లైట్, డీఆర్ఎల్స్, డ్యూయల్ పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, 360 డిగ్రీల కెమెరా, 8 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
వీటితో పాటు, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ కన్సోల్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, కీలెస్ ఎంట్రీ, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫుల్ సైజ్ ఎస్యూవీలో 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను స్టాండర్డ్గా అందించనున్నారు.

పరిమాణం పరంగా, నిస్సాన్ ఎక్స్-ట్రయల్ 7 మంది కూర్చునే సామర్థ్యంతో మూడు వరుసలతో ఉండనుంది. ఇది 4,680 మిమీ పొడవు, 1,840 మిమీ వెడల్పు, 1,725 మిమీ ఎత్తుని కలిగి ఉంది. అలాగే 2,705 మిమీ వీల్ బేస్ మరియు 210మిమీ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. పరిమాణం పరంగా టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ మరియు స్కోడా కొడియాక్ వంటి ప్రత్యర్థులతో పోలిస్తే ఎక్స్-ట్రైల్ చాలా చిన్నది.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 12 వి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇంజిన్ వేరియబుల్ కంప్రెషన్ మరియు టర్బోఛార్జర్తో వస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడిన ఈ ఎస్యూవీ0 160 bhp వద్ద 300 nm గరిష్ట టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్యూవీ ఎకో, స్టాండర్డ్ మరియు స్పోర్ట్ వంటి మూడు డ్రైవ్ మోడ్ లను కలిగి ఉంటుంది.
ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నిస్సాన్ ఎస్యూవీ కూడా మిత్సుబిషి అవుట్ ల్యాండర్ నిర్మించిన CMF-C ప్లాట్ఫామ్పై వస్తుంది. ఇతర ప్రత్యర్థి ఎస్యూవీలల కాకుండా ఇంది ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ని కలిగి ఉండదు. నిస్సాన్ భారతీయ వినియోగదారులకు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది.


Click it and Unblock the Notifications








