ఫోర్డ్ సరికొత్త ఆవిష్కరణ.. ఎలక్ట్రిక్ కార్లలో కొత్త విప్లవం.. మిగతా కంపెనీలు మూసుకోవాల్సిందే !

ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటికి ఆటోమేటిక్ ట్రాన్స్‎మిషన్ మాత్రమే ఇప్పటి వరకు అందించారు. అందుకే చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఆటోమేటిక్స్‌పై కొంచెం ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ కొందరు మాత్రం ఎలక్ట్రిక్ కార్లకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. అలాంటి వారికోసం ఫోర్డ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ప్రారంభించబడిన ఏ ఎలక్ట్రిక్ వాహనాలలోనూ ఈ సిస్టమ్ లేదు. కానీ ఫోర్డ్ ఇలాంటి ఓ సాహసోపేతమైన నిర్ణయంతో ముందుకు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను అందించడానికి ఫోర్డ్ కంపెనీ పేటెంట్ హక్కులను పొందింది.ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను అందించడానికి పేటెంట్ పొందిన అమెరికన్ బ్రాండ్ ఫోర్డ్ మాత్రమే.

Ford Electric Vehicles

త్వరలోనే ఫోర్డ్ రెట్రో-స్టైల్ మాన్యువల్ షిఫ్టర్‌ను అందించాలని యోచిస్తోంది. 2023లో పొందిన పేటెంట్‌ను కంపెనీ మార్చిలో విడుదల చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎక్స్‎పీరియన్స్ అందించగలదని కంపెనీ పేర్కొంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అంటే ఇష్టపడేవారికి ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఫోర్డ్ కంపెనీ ఈ నూతన ఆవిష్కరణ ఎలక్ట్రిక్ వాహనాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఈ లివర్‌ని ఉపయోగించి మోటారు స్పీడ్, టార్క్ అవుట్‌పుట్‌ను మార్చడానికి సహాయపడే ఎలక్ట్రానిక్ సిస్టమ్‎గా పనిచేస్తుంది. ఫోర్డ్ పునరాగమనం గురించి ఇటీవల అమెరికా సందర్శించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఫోర్డ్ కంపెనీతో సమావేశమై తమిళనాడుకు ఆహ్వానించారు. ఆ కంపెనీ ఆహ్వానాన్ని అంగీకరించింది.

Ford Endeavour

తమిళనాడులో మూసివేయబడిన ఫ్యాక్టరీని ఏ విధంగా ఉపయోగించాలో ఆలోచిస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలియజేశారు.. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. భారతదేశం కోసం కొత్త కార్లను ఇక్కడ తయారు చేయదు. మూడు సంవత్సరాల విరామం తర్వాత ఎగుమతి మార్కెట్ల కోసం వాహనాలను తయారు చేయడానికి ఫోర్డ్ కంపెనీ ప్రణాళికలు చేస్తుంది.. ఈ ప్రయత్నం వలన వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి.

Take a Poll

తమిళనాడులో ఉన్న గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్‌లో ఫోర్డ్ కంపెనీకి 12వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో ఈ సంఖ్య మరో 2,500 నుంచి 3,000 ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2022లో ఫ్యాక్టరీలు మూసివేయబడిన తర్వాత గుజరాత్‌లోని ఫ్యాక్టరీని టాటా మోటార్స్‌కు విక్రయించారు. తమిళనాడులోని ఫ్యాక్టరీని మాత్రం విక్రయించడానికి ఫోర్డ్ కంపెనీ సిద్ధంగా లేదు.

Ford Eco Sport

చెన్నైలోని మధురమంగళంలో దాదాపు 350 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. సానంద్‌లోని ఇంజిన్ తయారీ సౌకర్యాలతో పాటు ఫోర్డ్ కంపెనీ అత్యధిక వేతనాలు చెల్లించే రెండవ దేశం ఇండియా. ఫోర్డ్ కంపెనీ కొత్తగా విడుదల చేసే ఎలక్ట్రిక్ కార్లను చెన్నైలోని ప్లాంట్‌లో తయారు చేయడానికి ఆలోచనలు చేస్తుంది. మరియు ఎండీవర్‌ను కూడా ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది.

ఏడాదికి 1.50 లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్‌లను తయారు చేసే సామర్థ్యం కలిగిన తమిళనాడు ప్లాంట్ నుంచి కొత్త ఎండీవర్‌ను ఎగుమతి చేయడానికి ఫోర్డ్ కంపెనీ ప్రణాళికలు చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 27, 2025, 15:00 [IST]
English summary
Fords electric revolution manual transmission patent shakes up ev market
Read more on: #ford #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+