ఇక నెక్ట్స్ జనరేషన్ అంతా వీటిదే.. పెట్రోల్ కార్లన్నీ పాత సామాన్లకే..త్వరలో మార్కెట్లోకి హైబ్రిడ్ కార్ల సునామీ
భారతీయ ఎస్యూవీ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన హోండా, హ్యుందాయ్, కియా, రెనాల్ట్ 2026-2027 నాటికి కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్యూవీలను విడుదల చేయబోతున్నాయి. ఈ కొత్త వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తూనే, మంచి మైలేజీని అందిస్తాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
భారతీయ ఎస్యూవీ మార్కెట్లో ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూలమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, హోండా, హ్యుందాయ్, కియా, రెనాల్ట్ వంటి కంపెనీలు తమ సాధారణ పవర్ట్రైన్లను అడ్వాన్సుడ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కలిపి కొత్త కార్లను తీసుకురానున్నాయి.

హోండా:
హోండా 2027 చివరి నాటికి తమ మోడ్యులర్ పిఎఫ్2 (PF2) ప్లాట్ఫారమ్పై నిర్మించిన కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్యూవీని విడుదల చేయడానికి ప్రణాళిక వేస్తోంది. ఈ మోడల్ హోండా ఎలివేట్ నుంచి తీసుకున్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఇందులో సిటీ ఈ:హెచ్ఈవీ (City e:HEV) లాంటి పవర్ఫుల్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుందని సమాచారం.
ఈ హైబ్రిడ్ వ్యవస్థలో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీతో కలిసి పనిచేసే పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ మోడ్ల మధ్య సులభంగా మారే వీలు కల్పిస్తుంది. ఈ ఎస్యూవీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ప్రీమియం ఇన్ఫోటైన్మెంట్ సెటప్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ కారు ధర సుమారు రూ. 18 నుండి 20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు.

హ్యుందాయ్:
హ్యుందాయ్ 2027 నాటికి 'ఎన్ఐ1ఐ' (Ni1i) అనే కోడ్ నేమ్తో 7-సీటర్ హైబ్రిడ్ ఎస్యూవీని తీసుకురానుంది. అల్కాజర్, టక్సన్ మధ్య స్థానం పొందే ఈ ఎస్యూవీ, భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేయబడిన 1.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది.
కియా:
హ్యుందాయ్ బ్రదర్ బ్రాండ్ అయిన కియా కూడా ఎంక్యూ4ఐ (MQ4i) అనే కోడ్ నేమ్తో 7-సీటర్ హైబ్రిడ్ ఎస్యూవీని తీసుకురానుంది. ఇది గ్లోబల్ సోరెంటో (Sorento) ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది. మీడియం సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీపడుతుంది. హ్యుందాయ్, కియా రెండూ తమ మోడల్స్లో అడ్వాన్సుడ్ టెక్నాజలీ, సేఫ్టీ ఫీచర్లు, అధునాతన ఇంటీరియర్లను అందిస్తాయి.

రెనాల్ట్:
రెనాల్ట్ బోరియల్ (Boreal) అనే కొత్త కారును తీసుకురాబోతోంది. ఇది 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్ను పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్తో కలిపి హైబ్రిడ్ పవర్ట్రైన్ను ఉపయోగిస్తుంది. ఈ కారు సుమారు 155 బీహెచ్పి పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మంచి ధరలో విడుదల కావచ్చు.
ఈ హైబ్రిడ్ 7-సీటర్ ఎస్యూవీల రాక భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ హైబ్రిడ్ కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. పర్ఫామెన్స్ లేదా బూట్ స్పేసులో రాజీ పడకుండా ఫ్యామిలీలకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ వాహనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించే కస్టమర్ల నుంచి, వ్యాపార సంస్థల నుంచి మంచి స్పందన లభించవచ్చని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications








