ఎక్కువ మైలేజ్ ఇస్తోంది..మార్కెట్‎ను శాసిస్తోంది.. 100లో 81 మంది ఈ కంపెనీ కారే కొంటున్నారు!

ఇటీవలి కాలంలో భారతదేశంలో హైబ్రిడ్ కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మైలేజ్ ఎక్కువ ఇవ్వడం, పర్యావరణానికి మంచిది కావడం వంటి కారణాలతో వీటిని కొనేవారు పెరుగుతున్నారు. ఈ హైబ్రిడ్ సెగ్మెంట్‌లో టయోటా కంపెనీ ఏకంగా 81% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ముఖ్యంగా టయోటా హైక్రాస్ కారు బాగా అమ్ముడవుతోంది. ఈ హైబ్రిడ్ కార్ల మార్కెట్ ఎలా పెరుగుతోంది, ఏ కంపెనీలు ఎలా రాణిస్తున్నాయో తెలుసుకుందాం.

భారతదేశంలో హైబ్రిడ్ కార్లు ఇటీవల బాగా అమ్ముడవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇవి చాలా ఖరీదుగా ఉండేవి, ఎక్కువ ఆప్షన్లు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు వాటి ధరలు కూడా తగ్గాయి. కొత్త మోడళ్లు కూడా చాలా వస్తున్నాయి.

Innova HyCross Sales

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఈ హైబ్రిడ్ కార్లు పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. దీంతో ఈ రకం కార్ల వృద్ధి సుమారు 118% పెరిగింది. టయోటా కంపెనీ అత్యధిక సంఖ్యలో హైబ్రిడ్ వాహనాలను అమ్మింది.

గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 12,111 కార్లు మాత్రమే అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ సంఖ్య 21,489కి పెరిగింది. అంటే, అమ్మకాలు రెండింతలు పైగా పెరిగాయన్నమాట. మొత్తం హైబ్రిడ్ కార్ల మార్కెట్‌లో టయోటా 81% వాటాను దక్కించుకుంది.

Innova HyCross Sales

టయోటా కంపెనీ అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్, కామ్రీ, విల్ఫైర్ వంటి కార్లను హైబ్రిడ్ సెగ్మెంట్‌లో అమ్ముతోంది. టయోటాకు పోటీగా మారుతి కంపెనీ కూడా హైబ్రిడ్ కార్లను అమ్ముతోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 1307 కార్లు మాత్రమే అమ్మింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం, మారుతి ఏకంగా 4745 వాహనాలను అమ్మింది. ఇది 263% అమ్మకాల వృద్ధి.

మారుతి కార్ల అమ్మకాలు సుమారు 3 రెట్లు పెరిగాయని చెప్పొచ్చు. మారుతి కంపెనీ మార్కెట్‌లో గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కార్లను హైబ్రిడ్ సెగ్మెంట్‌లో అమ్ముతోంది. ఆ తర్వాత హోండా కంపెనీ కూడా హైబ్రిడ్ కార్లను అమ్ముతోంది. ఈ కంపెనీ కూడా హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించింది.

Innova HyCross Sales

గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హోండా కేవలం 59 కార్లు మాత్రమే అమ్మింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 226 వాహనాలను అమ్మింది. ఇది 283% వృద్ధిని చూపినప్పటికీ, మార్కెట్‌లో దీని వాటా కేవలం 1% మాత్రమే ఉంది. హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ అనే ఒక కారును మాత్రమే ఈ సెగ్మెంట్‌లో అమ్ముతోంది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హైబ్రిడ్ కారు టయోటా ఇన్నోవా హైక్రాస్ మాత్రమే. ఈ కారు ఈ సెగ్మెంట్‌లో చాలా ఖరీదైన కారు అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ కారును ఇష్టపడి కొంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో మంచి పేరున్న కారు కాబట్టి, చాలా మంది దీన్ని ఎంచుకుంటున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్ల వైపు చూస్తున్నారు. అందుకే ఈ సెగ్మెంట్ వేగంగా పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రకం కార్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అనడంలో సందేహం లేదు. పర్యావరణ స్పృహ, ఇంధన ధరల పెరుగుదల వంటివి హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2025, 13:55 [IST]
English summary
High mileage cars rule 81 of buyers choose this companys hybrid
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+