టాటా పంచ్కు వణుకుపుట్టించే హ్యుందాయ్ ఎక్స్టర్.. సరికొత్తగా రాబోతుంది.. మార్కెట్ను చుట్టేయడం ఖాయం
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ కార్లలో హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) ఒకటి. తక్కువ ధరకే లభిస్తున్న ఎస్యూవీ కావడంతో, దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ ఎక్స్టర్ కారు అప్డేట్ చేయబడిన ఫేస్లిఫ్ట్ మోడల్ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
ఈ కొత్త మోడల్లో కేవలం డిజైన్ మార్పులే కాకుండా, అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇందులో రాబోయే ఆండ్రాయిడ్ ఆటో ఆపరేటింగ్ సిస్టం (AAOS) ఫీచర్ భారతీయ మార్కెట్లోని మిగతా కార్లకు, ముఖ్యంగా టాటా పంచ్ (Tata Punch) వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఎక్స్టర్ ఫేస్లిఫ్ట్ మోడల్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ త్వరలో తమ ప్రముఖ ఎస్యూవీ మోడల్ ఎక్స్టర్ అప్డేటెడ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్లో కేవలం డిజైన్ మార్పులే కాకుండా, సరికొత్త ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి. కొత్త ఎక్స్టర్ ఫేస్లిఫ్ట్, హ్యుందాయ్ నెక్ట్స్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫీచర్ను పొందనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇది గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ ఆటో ఆపరేటింగ్ సిస్టమ్ (AAOS - Android Auto Operating System) ఫీచర్ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఇది జరిగితే, ఆండ్రాయిడ్ ఆటో ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చే మొదటి మాస్ మార్కెట్ కారుగా హ్యుందాయ్ ఎక్స్టర్ నిలవనుంది.

హ్యుందాయ్ ఎక్స్టర్ ఫేస్లిఫ్ట్ మోడల్లో డ్యూయల్ స్క్రీన్ సెటప్ అందించబోతున్నారు. ఇది కారు లోపలి భాగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ సెటప్లో ఒక స్క్రీన్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్గా పనిచేస్తుంది. మరొకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా పనిచేస్తుంది.
టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సైజు 12.9 అంగుళాలుగా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సైజు 9.9 అంగుళాలుగా ఉండవచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ భారీ స్క్రీన్ సెటప్ కారు లోపలికి ప్రీమియం లుక్ను తీసుకురానుంది.

కొత్త మోడల్లో డిజైన్, ఫీచర్ల పరంగా మార్పులు ఉన్నప్పటికీ, ఇంజిన్ ఆప్షన్లలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్/సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లే ఫేస్లిఫ్ట్ మోడల్లో కొనసాగే అవకాశం ఉంది.
గేర్బాక్స్ ఆప్షన్లు (5 స్పీడ్ మ్యాన్యువల్, ఏఎమ్టీ) కూడా పాతవే కొనసాగుతాయి. ప్రస్తుతం సీఎన్జీ మోడల్ కిలోకు 27.10 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుండగా, అదే మైలేజీ కొత్త మోడల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చౌకైన ఎస్యూవీలలో ఒకటిగా ఉంది.
ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.68 లక్షలు మాత్రమే కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 9.61 లక్షలుగా ఉంది. ఫేస్లిఫ్ట్ మోడల్లో అదనపు ఫీచర్ల కారణంగా ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయినా ఇది తక్కువ ధర ఎస్యూవీల సెగ్మెంట్లోనే కొనసాగుతుంది. ఈ కొత్త ఫీచర్లు, టెక్నాలజీ అప్డేట్ల కారణంగా మార్కెట్లో టాటా పంచ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఎక్స్టర్ సిద్ధమవుతోంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ఫేస్లిఫ్ట్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








