ఫోర్ వీలర్లో పోయినా.. త్రీ వీలర్లోనూ మహీంద్రాదే రాజ్యం.. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో రికార్డులు బద్దలు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫోర్ వీలర్ సెగ్మెంట్లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. అయితే త్రీ వీలర్ విభాగంలో మాత్రం మహీంద్రా (Mahindra) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సెగ్మెంట్లో మిగతా కంపెనీల దరిదాపుల్లో కూడా లేదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్లో మహీంద్రా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇటీవల ఆగస్టు నెలలో కంపెనీ పది వేలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ యూనిట్లను విక్రయించి, 75 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఈ విభాగంలో మహీంద్రాను అధిగమించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అందుకే, మహీంద్రా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్లో ఆగస్టు నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసింది. ఈ రికార్డు స్థాయి అమ్మకాలతో మహీంద్రా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్యాసింజర్ విభాగంలో ట్రియో సిరీస్, వాణిజ్య అవసరాల కోసం జోర్ మోడల్స్, ఇ-ఆల్ఫా శ్రేణి, ఫోర్-వీల్ సియో వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ కంపెనీకి చెందిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మార్కెట్లో ట్రయో (Treo) సిరీస్ బాగా ప్రాచుర్యం పొందింది. పాసెంజర్ విభాగంలో ట్రెయో, అలాగే వాణిజ్య అవసరాల కోసం జోర్, ఈ-ఆల్ఫా వంటి మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ కలిసి కంపెనీ అమ్మకాలకు భారీగా దోహదపడుతున్నాయి.
మహీంద్రా కంపెనీ గత సంవత్సరం ట్రయో ప్లస్ అనే సరికొత్త మోడల్ను విడుదల చేసింది. ఇది మెటల్ బాడీతో, ఎక్కువ మన్నికతో రూపొందించబడింది. ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ధర భారతదేశంలో రూ. 3.69 లక్షల నుంచి రూ. 3.78 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇందులో 10.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 8kW పవర్, 42 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు. కేవలం 4 గంటల 20 నిమిషాల్లో ఈ వెహికల్ పూర్తిగా చార్జ్ అవుతుంది.

డ్రైవర్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, ట్రయో ప్లస్ మోడల్ గంటకు 55 కిలోమీటర్ల టాప్ స్పీడుతో దూసుకెళ్లగలదు. అలాగే, హిల్ హోల్డ్ అసిస్ట్ టెక్నాలజీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
మహీంద్రా కంపెనీ తమ కస్టమర్ల సంక్షేమం కోసం ఉదయ్ NXT అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ట్రయో మెటల్ బాడీని కొనుగోలు చేసే డ్రైవర్లకు మొదటి సంవత్సరానికి రూ. 20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ బీమాలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తి కవరేజ్, శాశ్వత అంగవైకల్యం పొందితే 100 శాతం, పాక్షిక అంగవైకల్యం పొందితే 50 శాతం కవరేజ్ లభిస్తుంది.
మరోవైపు, మహీంద్రా కంపెనీ వీరో సిఎన్జి (Veero CNG) పేరుతో ఫోర్-వీలర్ సెగ్మెంట్లోనూ ఓ కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 9.39 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ వాహనం ఒక సిఎన్జి ట్యాంక్ను పూర్తిగా నింపితే 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి 4.5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఇందులో ఉంది. ఇవన్నీ కలిపి ఈ వాహనం 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ను అందిస్తుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








