ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి తిరుపతి వెళ్లి వెళ్లొచ్చు..పుణ్యానికి పుణ్యం.. డబ్బులు ఆదా..మారుతి భలే ప్లాన్
మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మారుతి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara)తో భారత ఈవీ మార్కెట్లో విప్లవం సృష్టించడానికి సిద్ధమైంది. కేవలం కారును లాంచ్ చేయడమే కాకుండా, వినియోగదారులకు రేంజ్ ఆందోళన (Range Anxiety) లేకుండా చేసేందుకు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. 2026 పొంగల్ పండుగ సందర్భంగా లాంచ్ కానున్న ఈ కారు గురించి మరిన్ని తాజా, ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.
భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది (2026) పొంగల్ పండుగను టార్గెట్ చేస్తూ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ-విటారా బుకింగ్స్ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. కేవలం కారును లాంచ్ చేయడమే కాకుండా, పెట్రోల్ బంకుల తరహాలో దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్ను నిర్మించే ప్లాన్తో మారుతి వస్తోంది.

మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను 2026 జనవరి 15న (సంక్రాంతి సందర్భంగా) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ పండుగ సీజన్లో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం అదే సమయంలో బుకింగ్స్ను కూడా ప్రారంభించబోతోంది. ఈ కారును మారుతి తన ప్రీమియం డీలర్షిప్ అయిన నెక్సా (Nexa) ద్వారా విక్రయించనుంది. ఇప్పటికే గుజరాత్ ప్లాంట్లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది, విదేశాలకు ఎగుమతులు కూడా మొదలయ్యాయి.
ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో రాబోతోంది.ఒకటి 48.8 kWh బ్యాటరీతో 144 PS పవర్ను ఇస్తుంది. రెండోది 61.1 kWh బ్యాటరీతో 543 కి.మీ (ARAI క్లెయిమ్డ్) రేంజ్ను అందిస్తుంది. ఇది 174 PS పవర్, 192.5 Nm టార్క్ను జనరేట్ చేస్తుంది. ఈ కారు కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. లాంగ్ ట్రిప్స్కు వెళ్లే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్.

సాధారణంగా మారుతి కార్లు సేఫ్టీలో వెనుకబడి ఉంటాయనే అపవాదు ఉంది. కానీ ఇ-విటారాతో ఆ ముద్రను చెరిపేస్తోంది. ఈ కారు భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్ట్లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇది మారుతి నుంచి వస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలవనుంది. ఇందులో Level-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, 7 ఎయిర్బ్యాగ్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
కారు కొన్న తర్వాత ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలనే టెన్షన్ లేకుండా మారుతి మాస్టర్ ప్లాన్ వేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,00,000 (ఒక లక్ష) ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఇప్పటికే 13 ఛార్జింగ్ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని వెతకడానికి 'E for Me' అనే ప్రత్యేక యాప్ను కూడా తీసుకొస్తోంది.

ఇది ప్రీమియం ఎస్యూవీ కాబట్టి, దీని ధర రూ. 17 లక్షల నుంచి రూ. 23 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఇది టాటా కర్వ్ ఈవీ (Tata Curvv.ev), ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








