లీటరుకు 40 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు! ధర కూడా తక్కువ.. హైబ్రిడ్–ఎలక్ట్రిక్ కార్లతో మారుతి సంచలనం
మారుతి సుజుకి (Maruti Suzuki) ఇప్పటివరకు భారత కుటుంబాలను గమనిస్తూ, ముఖ్యంగా చిన్న ఫ్యామిలీల కోసం 5 సీటర్ల కార్లను విస్తారంగా అందించింది. అయితే ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులు కంపెనీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేలా చేశాయి. చిన్న కార్ల అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడంతో, కేవలం ఫేస్లిఫ్ట్లు ఇవ్వడం, రంగులు మార్చడం లేదా చిన్నపాటి డిజైన్ అప్డేట్లు చేయడం ద్వారా మార్కెట్ను ఆకట్టుకోవడం ఇక సాధ్యం కాదని మారుతి ఇప్పుడు స్పష్టంగా గ్రహించింది. ఈ నేపథ్యంలో కంపెనీ పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. పర్యావరణ అనుకూలమైన మరియు వినియోగదారులకు సరసమైన ధరలో అందుబాటులో ఉండే హైబ్రిడ్, జీరో ఎమిషన్ వాహనాల అభివృద్ధిపై మారుతి దృష్టిసారిస్తోంది.
ఇప్పటి వరకు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ టెక్నాలజీ ప్రధానంగా మిడ్-సైజ్ లేదా ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితమై ఉండగా, మారుతి మాత్రం ఈ సాంకేతికతను చిన్న కార్లలోనే అందించాలని యోచిస్తోంది. ఇది కేవలం కొత్త ఉత్పత్తులను తీసుకురావడం మాత్రమే కాకుండా, భవిష్యత్ భారత మార్కెట్ను ఎలా రూపుదిద్దుకోవాలనే దాని మీద మారుతి చేస్తున్న పెద్ద నిర్ణయం కూడా.

భారతీయ వినియోగదారులు ఎక్కువగా చూస్తున్న అంశాలు.. మంచి ఫ్యూయల్ ఎకానమీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, రోజువారీ ప్రయాణానికి అనువైన కాంపాక్ట్ సైజు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటూ కొత్త తరహా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ చిన్న కార్లను రూపొందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ మార్పుతో వచ్చే కాలంలో మారుతి నుంచి పూర్తిగా కొత్త ప్లాట్ఫారమ్పై ఆధారపడిన, అల్ట్రా-ఎఫిషియెంట్ హైబ్రిడ్ హాచ్బ్యాక్లు, అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ మోడళ్లు మార్కెట్లోకి రావచ్చు.
ఇవి కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, వినియోగదారుల బడ్జెట్కు కూడా మరింత అనుకూలంగా ఉండేలా డెవలప్ చేయబడుతాయని అంచనా. కంపెనీ ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించింది. రాబోయే కాలంలో మారుతి క్రాస్ఓవర్, హ్యాచ్బ్యాక్, MPV వంటి విభాగాల్లో పూర్తిగా కొత్త తరహా మోడళ్లను మార్కెట్లోకి తీసుకురాబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులలో అత్యంత ముఖ్యమైనది ఫ్రాంక్స్ మోడల్ అప్డేట్.

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అమ్ముడవుతున్న ఫ్రాంక్స్కు అక్కడి వెర్షన్లో ఇప్పటికే కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇదే తరహా అప్డేట్లు భారతీయ వెర్షన్లో కూడా రాబోయే నెలల్లో చూడవచ్చని అంచనా. క్రాస్ఓవర్ డిజైన్లో మెరుగులు, స్టైల్ అప్డేట్లతో పాటు, ముఖ్యంగా ఇంజిన్ విభాగంలో మార్పులు అత్యంత ఆసక్తికరంగా ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఫ్రాంక్స్లో ఉపయోగిస్తున్న మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను భారత మార్కెట్కు కూడా పరిచయం చేయాలని మారుతి యోచిస్తోంది.
ముఖ్యంగా అటోస్ ఇంజిన్తో హైబ్రిడ్ వ్యవస్థను కలపడం ద్వారా మరింత మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ అందించడంపై కంపెనీ దృష్టి ఉంది. దీనికి మారుతి పూర్తిగా స్వదేశీ హైబ్రిడ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇది భవిష్యత్లో భారతీయ వినియోగదారులకు మరింత తక్కువ ధరలో హైబ్రిడ్ కార్లను అందించే అవకాశం కల్పిస్తుంది. ఇంతలో, మారుతి ఎంట్రీ-లెవల్ కారుపై కూడా పనిచేస్తోంది. కారు ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెట్టే కొనుగోలుదారులకు ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతోంది.

మారుతి రాబోయే సంవత్సరాల కోసం రూపొందిస్తున్న వ్యూహంలో, బాలెనో కొత్త తరం మోడల్కు ప్రత్యేక స్థానం ఉంది. కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ను 2027లో కొత్త రూపంలో, మరింత ఆధునిక ఫీచర్లు, భవిష్యత్ టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థ బాలెనోలో అమర్చబడితే, లీటరుకు 40 కి.మీ వరకు మైలేజీ అందించే అవకాశముంది. మరో విషయం ఏమిటంటే ఇది దాదాపుగా బడ్జెట్ ధరలోనే వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








