20 ఏళ్లుగా జనాలు నమ్మకంగా కొంటున్న కారు.. భారతీయుల హృదయాల్లో చెరిగిపోని మోడల్.. ఇప్పటికీ బెస్ట్ సెల్లర్
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ(Maruti suzuki) అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికి మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. సేల్స్లో ప్రతి ఏడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది. మార్కెట్లో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మారుతీ సుజుకీ కార్లంటే దేశంలో చాలా మందికి ఇష్టం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెల ముగియగానే ఆటోమొబైల్ కంపెనీలన్ని కూడా తమ అమ్మకాల వివరాలు విడుదల చేస్తున్నాయి.
ఈ క్రమంలో మారుతీ సైతం మోడళ్ల వారీగా సేల్స్ డేటాను వెల్లడిస్తుంది. తాజాగా భారతీయ కస్టమర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన స్విఫ్ట్ (Swift) కారుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఈ కారు చాలా ఏళ్లుగా మార్కెట్లో తన హవాను కొనసాగిస్తుంది. నెల నెలా మంచి పనితీరును కనబరుస్తూనే ఉంది. దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఇది అత్యంత డిమాండ్ ఉన్న మోడల్.

మారుతీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 2025 నెలలో స్విఫ్ట్ కారు 16,269 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2024 ఏడాది ఇదే ఫిబ్రవరి నెలలో 13,165 యూనిట్ల అమ్మకాలు సాధించగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి సేల్స్ 24 శాతం వృద్ధి చెందడం విశేషం. భారత మార్కెట్లో ఫిబ్రవరి 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల లిస్ట్లో స్విఫ్ట్ నాలుగో స్థానంలో నిలిచింది.
భారతదేశంలో స్విఫ్ట్ కారు అంటే తెలియని వారు ఉండరు. ఇది దేశంలో మే 2005 లో విడుదల అయింది. సాధారణ మోడల్గా లాంచ్ అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే ఇది మార్కెట్లో అమ్మకాల పరంగా సంచనాలకు కేంద్ర బిందువు అయింది. స్విఫ్ట్ కారు చిన్న కుటుంబానికి అత్యంత బెస్ట్ మోడల్. ఉద్యోగస్తులు మొదలగు వారు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

దాదాపు 2 దశాబ్దాలు స్విఫ్ట్ కారుకు డిమాండ్ తగ్గకపోవడం చాలా గొప్ప విషయం. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన 20 ఏళ్ల నుంచి ఇది ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా మరిన్ని కొత్త ఫీచర్స్తో అప్డేట్ అవుతూనే ఉంది. అందుకే స్విఫ్ట్ ప్రతి ఏడాది తన అమ్మకాలతో ఇతర కార్లకు పోటీగా నిలుస్తూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో మొదటి 3 స్థానాల్లో ఫ్రాంక్స్, వ్యాగన్ ఆర్, క్రెటా తర్వాత స్విఫ్ట్ ఉంది.
ఇక ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న స్విఫ్ట్ విషయానికి వస్తే, ఇది 4వ తరం మోడల్ ఇప్పుడు లభిస్తుంది. దాని పాత తరంతో పోలిస్తే ఇది డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ను కలిగి ఉంది. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ (Lxi) ప్రస్తుత ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). అదే టాప్ వేరియంట్ (Zxi+ AGS) ధర రూ. 9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్).

స్టాండర్డ్గా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగులు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్స్ను కలిగి ఉంది. వైర్లెస్ సెల్ ఫోన్ ఛార్జర్, 9-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి ఈ కారులో ఉన్నాయి. పెట్రోల్ మాన్యువల్ ఆప్షన్ 24.80 కి.మీ మైలేజ్, పెట్రోల్ ఆటోమేటిక్ 25.75 కి.మీ మైలేజ్, CNG మాన్యువల్ కిలొ ఇంధనానికి 32.85 కి.మీల మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








