కేవలం 31 రోజుల్లో 13 వేల మంది కొన్నారు.. 29 కి.మీ మైలేజ్ కారుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
మారుతి సుజుకి (Maruti Suzuki) తాజాగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లోకి దిగ్గజంగా అడుగుపెట్టిన మోడల్ విక్టోరిస్ (Victoris), భారతీయ ఆటో మార్కెట్లో తన ప్రభావాన్ని బలంగా చూపిస్తోంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీలు అన్నీ కలిపి విడుదలైన తొలి రోజునుంచే ఈ SUVపై వినియోగదారుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ధర పరంగా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల, సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న పోటీని మరింత తీవ్రమైందిగా మార్చింది. తాజాగా విడుదలైన సేల్స్ గణాంకాలు ఈ SUV విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత నెలలో మాత్రమే మారుతి సుజుకి మొత్తం 13,496 యూనిట్ల విక్టోరిస్ను విక్రయించినట్లు వెల్లడించింది. ఇది ఈ సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశించిన మోడల్కు గొప్ప విజయమే కాక, మార్కెట్లో దీని స్థిరమైన డిమాండ్కు నిదర్శనం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,విక్టోరిస్ ప్రారంభించిన మొదటి నెలలోనే 4,261 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఒక కొత్త SUV కోసం ఇది చాలా మంచి ఆరంభం. దానికి తోడు, విక్టోరిస్ బుకింగ్ సంఖ్యలు కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. విడుదలైన కొద్ది రోజులకే ఈ మిడ్-సైజ్ SUV 25,000 యూనిట్ల బుకింగ్ మార్క్ను దాటి మరింత సంచలనాన్ని సృష్టించింది. ఈ గణంకాలు SUVపై ఉన్న వినియోగదారుల నమ్మకం, ఆసక్తిని అర్థం చేసుకునేలా ఉన్నాయి.

మారుతి సుజుకి విక్టోరిస్ ధరలను పరిశీలిస్తే, ఈ మోడల్ భారత్ మార్కెట్లో 10.50 లక్షల నుంచి 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉండటం వినియోగదారులకు విస్తృత ఎంపికలను అందిస్తోంది. అనేక వేరియంట్లలో లభించే ఈ SUV, బడ్జెట్ నుండి ప్రీమియం ఫీచర్ల వరకు అన్ని రకాల కొనుగోలుదారుల రుచిని తీర్చేలా రూపుదిద్దుకుంది. ఇటీవల, కంపెనీ విక్టోరిస్ ధరల విషయంలో కొన్ని మార్పులు చేసింది.
కొన్ని వేరియంట్ల ధరలను రూ. 15,400 వరకు పెంచినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం ధరలో 1.13 శాతం పెరుగుదల నమోదైంది. అయితే, సాధారణంగా ఎక్కువగా అమ్ముడయ్యే LXI, VXI వేరియంట్ల ధరలను మార్చకుండా అలాగే కొనసాగించింది. దీనితో, బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసింది. అయితే ZXI, ZXI (O), ZXI ప్లస్, ZXI ప్లస్ (O) వేరియంట్లకు మాత్రం రూ. 15,400 ధరల పెరుగుదల చేసింది.

ఇది ప్రధానంగా ప్రీమియం వేరియంట్ల సెగ్మెంట్ను ప్రభావితం చేసింది. అయితే, విక్టోరిస్ టాప్ హైబ్రిడ్ వేరియంట్ మాత్రం ఈ ధరల మార్పులకు గురికాకపోవడం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ధరల పెరుగుదలతో పాటు, కంపెనీ కొన్ని ఫీచర్లలో కూడా మార్పులు చేసింది. ప్రత్యేకంగా, ZXI, ZXI(O) వేరియంట్ల నుండి లెథరెట్ అప్హోల్స్టరీ ఫీచర్ తొలగించడం వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఇది కొంతమందికి నిరాశ కలిగించినా, ఇతర ఫీచర్లు బలంగా ఉన్నాయి.
మారుతి సుజుకి విక్టోరిస్ SUV పవర్ట్రెయిన్ పరంగా మూడు వేర్వేరు ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఆప్షన్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, రోజువారీ ప్రయాణాలకు, సిటీ డ్రైవ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. రెండో ఎంపిక డ్యూయల్ ఫ్యూయల్ CNG ఆప్షన్. మూడవ1.5-లీటర్ పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అందుబాటులో ఉండటం వల్ల, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, పనితీరు రెండింటినీ సమానంగా అందిస్తుంది.

మైలేజ్ విషయానికి వస్తే, హైబ్రిడ్ వేరియంట్లు 28.65 kmpl వరకు మైలేజ్ను అందిస్తాయి. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు 21.18 kmpl, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు 21.06 kmpl వరకు మైలేజ్ ఇస్తాయి. అడ్వెంచర్ ప్రేమికులకు రూపొందించిన పెట్రోల్ AWD వేరియంట్ కొంచెం తక్కువగా 19.07 kmpl మైలేజ్ ఇస్తుంది. ఆర్థిక ప్రయాణాన్ని కోరుకునే వారికి CNG వేరియంట్ మరో అద్భుత ఎంపిక. ఇది 27.02 km/kg క్లెయిమ్డ్ మైలేజ్ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








