ఎవరికీ అందని ఎత్తులో టాటా.. ఇండస్ట్రీనే వణికిపోయింది! భారతదేశంలో నెం.1.. బాస్ ఎవరో మరోసారి రుజువు!
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) తన ఆధిపత్యాన్ని మరోసారి బలంగా నిరూపించుకుంది. ఒకప్పుడు ప్రారంభ దశలో ఉన్న EV మార్కెట్ను నేడు దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాల్లోకి తీసుకొచ్చిన బ్రాండ్గా TATA.ev నిలిచింది. 2020లో టాటా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ కారుగా Nexon.evను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఈ విభాగంలో స్థిరమైన నాయకత్వాన్ని కొనసాగిస్తోంది. కేవలం కొత్త మోడళ్లను విడుదల చేయడమే కాకుండా, వినియోగదారుల నమ్మకాన్ని కూడా దక్కించుకుంటూ EV మార్కెట్ పరిణామానికి దిశానిర్దేశం చేస్తోంది.
ఈ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా, భారతదేశంలో 1,00,000 అమ్మకాలను దాటిన తొలి ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ EVగా నిలిచిందని టాటా అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక మోడల్ విజయం మాత్రమే కాకుండా, దేశంలో ఎలక్ట్రిక్ కార్లపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటీవల టాటా మోటార్స్ మరో కీలకమైన మైలురాయిని కూడా చేరుకుంది. మొత్తంగా 2,50,000 TATA.ev వాహనాల అమ్మకాలు పూర్తయ్యాయని కంపెనీ వెల్లడించింది.

ఇది భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. నేడు భారతదేశ EV ప్యాసింజర్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్కు ఉన్న స్థానం అసాధారణమైనది. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న మొత్తం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల్లో దాదాపు 66 శాతం మార్కెట్ షేర్ టాటా మోటార్స్దే కావడం, ఈ బ్రాండ్కు వినియోగదారులు ఇస్తున్న ఆదరణను ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ ముందంజలో నిలవడానికి మరో ముఖ్యమైన కారణం, అతిపెద్ద EV పోర్ట్ఫోలియో. ప్రస్తుతం TATA.ev లైనప్లో టియాగో EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV, హారియర్ EV వంటి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, XPRES-T EV వంటి ఫ్లీట్ సెగ్మెంట్ కోసం రూపొందించినవి కూడా ఉన్నాయి. ఈ విస్తృత శ్రేణి కారణంగా టాటా మంచి స్థానంలో ఉంది.

అంతేకాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది టాటా మోటార్స్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు. టాటా మోటార్స్ అసమానమైన భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి బలమైన మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం TATA.ev నెట్వర్క్లో 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి భాగస్వామి CPOల సహకారంతో హోమ్ ఛార్జింగ్, కమ్యూనిటీ ఛార్జింగ్, పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాల కలయికగా విస్తరించి ఉన్నాయి.
TATA.ev దేశవ్యాప్తంగా 20,000కి పైగా రిజిస్టర్డ్ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లతో కవరేజీని అందిస్తోంది. దీంతో ప్రయాణాల్లో ఛార్జింగ్ గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దేశంలోనే అతిపెద్ద సూపర్ఫాస్ట్ ఛార్జర్ల నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రధాన జాతీయ హైవేలు , కీలక కారిడార్లలో ఇప్పటికే 16 మెగా కారిడార్లపై ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయగా, 120kW కంటే ఎక్కువ ఛార్జింగ్ వేగంతో 100 మెగాచార్జింగ్ హబ్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని TATA.ev 2027 నాటికి, ఓపెన్ సహకార ఫ్రేమ్వర్క్ ఆధారంగా పనిచేస్తూ, 30,000కు పైగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లతో మొత్తం 4,00,000 ఛార్జ్ పాయింట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల నగరాలు మాత్రమే కాకుండా, హైవేలు, దూర ప్రాంతాల్లో కూడా EV వినియోగదారులకు ఛార్జింగ్ సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదే దిశలో ముందుకెళ్తూ, 2030 నాటికి మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్ధేశించింది.


Click it and Unblock the Notifications








