ఎంట్రీ-లెవెల్ కార్లకు కష్టకాలం.. ఈ ఒక్కటి జరిగితే చాలు.. సామాన్యులు బైక్ ధరకే కారు సొంతం చేసుకోవచ్చు

మనదేశంలో ఒకప్పుడు చిన్న కార్లు (ఎంట్రీ లెవెల్ కార్లు) మార్కెట్‌ను ఏలాయి. లక్షల్లో అమ్ముడై, సామాన్యుల కారు కలను నెరవేర్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 10 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైన ఈ చిన్న కార్లు, ఇప్పుడు కేవలం కొన్ని వేల యూనిట్లకు పడిపోయాయి. ధరలు పెరగడం, ప్రజల అభిరుచులు మారడం వంటి కారణాలతో చిన్న కార్లకు డిమాండ్ తగ్గింది.

అయితే, ఒక ముఖ్యమైన విషయం జరిగితే మళ్లీ టూవీలర్ ధరకే కార్లను అమ్మే అవకాశం ఉందని ఒక మార్కెట్ నిపుణుడు చెబుతున్నారు. ఆ విషయం ఏంటి? చిన్న కార్లు మళ్ళీ మార్కెట్‌లో రాజ్యం ఏలుతాయా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Entry-level cars

భారతదేశంలో ఎంట్రీ-లెవెల్ కార్లు రూ. 5 లక్షల కన్నా తక్కువ ధరలో అమ్ముడవుతున్నాయి. గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ కార్లు అమ్ముడవగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 25,402 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయాయి. ధర తక్కువ ఉన్నప్పటికీ ప్రజలు ఈ రకం కార్లను అంతగా ఇష్టపడడం లేదని దీనివల్ల స్పష్టంగా తెలుస్తోంది.

ఒకప్పుడు భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌ను చిన్న కార్లే ఆక్రమించాయి. కానీ, ఇప్పుడు చిన్న కార్ల వాటా 30శాతం కంటే తక్కువకు పడిపోయింది. గత మే నెలలో మారుతి ఆల్టో(Maruti Alto), ఎక్స్‌ప్రెస్సో(S-Presso) వంటి కార్ల అమ్మకాలు 6,776 యూనిట్లకు తగ్గాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ కార్ల అమ్మకాలు 9,902 యూనిట్లుగా ఉన్నాయి.

Maruti

ఇది మాత్రమే కాదు బాలెనో (Baleno), సెలెరియో (Celerio), డిజైర్ (Dzire), ఇగ్నిస్ (Ignis), స్విఫ్ట్ (Swift), వాగన్ ఆర్ (Wagon R) వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా తగ్గాయి. ఈ కార్లన్నీ కలిపి 61,502 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 68,206 కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

ఇటీవలి కాలంలో ప్రభుత్వం వాహనాలపై నిబంధనలను పెంచింది. దీనివల్ల చిన్న కార్లను కూడా ఎక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టూవీలర్ వాడుతున్న ఒక కుటుంబం కారుకు మారాలంటే చాలా ఆలోచిస్తోంది. చిన్న కార్లకు, కాంపాక్ట్ కార్లకు మధ్య పెద్దగా ధర తేడా లేదు. కాంపాక్ట్ కార్లను కొనడానికి ప్రజల దగ్గర తగిన ఆర్థిక స్థోమత లేదు.

Alto K10

దీనిపై ఒక మారుతి కంపెనీ అధికారి మాట్లాడుతూ.. చిన్న కార్లకు ప్రభుత్వం సబ్సిడీలు (Subsidies) ఇవ్వాలని అన్నారు. ఇలా సబ్సిడీలు ఇస్తే భారతదేశంలో ఆటోమొబైల్ రంగం భారీ వృద్ధిని సాధిస్తుందని ఆయన చెప్పారు. వాహనాల ధరల వల్లే చిన్న కార్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవడం లేదు. సబ్సిడీలు అందిస్తే టూవీలర్ ధరలో కార్లను విక్రయించవచ్చని ఆయన అన్నారు.

ఆయన చెప్పిన ప్రకారం.. ప్రస్తుతం ఒక వాహనం కొనాలంటే దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. చిన్న వాహనాలను కొనాలనుకునే చాలా మంది, ఇంకొంచెం ఖర్చు చేస్తే మంచి కారు కొనవచ్చని భావించి, మరికొంత కాలం వేచి చూసి కాంపాక్ట్ లేదా ఎస్‌యూవీ (SUV) రకం కార్లను కొంటున్నారు. దీనివల్ల ఈ రకం కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో తక్కువ ధర కారును కొనుగోలు చేయడం ఒక స్టేటస్ సమస్యగా మారింది. టాటా నానో (Tata Nano) కారు పెద్ద ఎత్తున అమ్ముడుపోకపోవడానికి ఇది ఒక కారణం. ఈ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతోంది.

తక్కువ ధరలో కార్లు ఉంటేనే, దానికంటే కొంచెం ఎక్కువ ధరలో ఉన్న కార్లు కూడా అమ్ముడవుతాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో కార్లను అందిస్తే, మళ్ళీ చిన్న కార్ల మార్కెట్ ఊపందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 3, 2025, 15:43 [IST]
English summary
The decline of small cars from market domination to a mere 3 share
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+