తూత్తుకుడిలో నేడే ప్రారంభమైన విన్‎ఫాస్ట్ ప్లాంట్.. 16,000 కోట్ల పెట్టుబడితో చరిత్ర సృష్టించిన తమిళనాడు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ మార్కెట్లో వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ అడుగుపెట్టింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ సంస్థ తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తి లక్ష్యాలు, భారతదేశానికి ఈ ప్రాజెక్ట్ ఎలా లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్. భారతదేశంలో తమ ప్లాంట్‌ను తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ దాదాపు రూ.16,000 కోట్లు (2 బిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకుంది.

VinFast

ఇందులో మొదటి ఐదు సంవత్సరాల్లో 500 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత క్రమంగా పెట్టుబడిని పెంచాలని నిర్ణయించుకుంది. ఈ ప్లాంట్ కోసం మొత్తం 114 ఎకరాల భూమిని కేటాయించారు. విన్ ఫాస్ట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి 1.5 లక్షల వాహనాలను తయారు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, మొదట్లో 50,000 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో తయారయ్యే వాహనాలను భారతదేశంలో మాత్రమే కాకుండా, శ్రీలంక, నేపాల్, మారిషస్ వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. తూత్తుకుడిలో నౌకాశ్రయం ఉండటం వల్ల ఎగుమతులు సులభంగా జరుగుతాయని, అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

VinFast

విన్ ఫాస్ట్ తమ మొదటి కార్లుగా VF6, VF7 మోడళ్లను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ కార్లను ప్రదర్శించారు. మొదటగా, ఈ కార్ల విడిభాగాలను వియత్నాం నుంచి దిగుమతి చేసుకుని, తూత్తుకుడి ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తారు. ఆ తర్వాత, క్రమంగా ఈ విడిభాగాలను భారతదేశంలోనే తయారు చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఈ కార్లను చాలా తక్కువ ధరకే మార్కెట్లో విక్రయించవచ్చని కంపెనీ చెబుతోంది.

విన్ఫాస్ట్ ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. 2024లో మొత్తం 97,000 వాహనాలను తయారు చేసి విక్రయించింది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. ఈ అమ్మకాల్లో 10శాతం వియత్నాం వెలుపల జరిగింది. భారతదేశంతో పాటు, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కూడా తమ ప్లాంట్‌లను నిర్మిస్తోంది. ఈ కొత్త ప్లాంట్ ప్రారంభంతో, విన్ఫాస్ట్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 4, 2025, 14:50 [IST]
English summary
Vinfast inaugurates ev plant in thoothukudi a game changer for indias auto sector
Read more on: #tamil nadu #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+