ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు జనాలు బ్రహ్మరథం! దేశంలో నంబర్ 1.. ఎలక్ట్రిక్ కారు కొనాలంటే ఇదే బ్రాండ్
2026 సంవత్సరం ప్రారంభం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మెల్లగా పెరుగుతూ వచ్చిన ఈ విభాగం, ఇప్పుడు స్పష్టమైన వేగాన్ని అందుకుంది. కేవలం ప్రయాణీకుల కార్లు మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల విభాగంలో కూడా ఎలక్ట్రిక్ మోడళ్లకు గణనీయమైన ఆదరణ కనిపిస్తోంది. ఇది భారత మార్కెట్లో మారుతున్న వినియోగదారుల అభిరుచిని స్పష్టంగా తెలియజేస్తోంది. కొత్త కొత్త ఎలక్ట్రిక్ మోడళ్ల నిరంతర ప్రవేశం కొనుగోలుదారులకు విస్తృత ఎంపికలను అందిస్తోంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను రాయితీలు కూడా ఈ మార్పుకు బలంగా దోహదపడుతున్నాయి. ఫలితంగా, ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమర్ల విశ్వాసం స్పష్టంగా పెరిగింది.
వాహన డీలర్ల జాతీయ సమాఖ్యగా ఉన్న Federation of Automobile Dealers Associations విడుదల చేసిన రిటైల్ అమ్మకాల గణాంకాలు ఈ ఉత్సాహాన్ని అంకెల రూపంలో చూపిస్తున్నాయి. 2026 జనవరిలో దేశవ్యాప్తంగా మొత్తం 18,470 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 2025 జనవరిలో నమోదైన 11,935 యూనిట్లతో పోలిస్తే 54.75 శాతం ఎక్కువ. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే ఎలక్ట్రిక్ కార్ల విభాగం సగానికి పైగా పెరుగుదల సాధించింది.

అదే సమయంలో నెలవారీ ప్రాతిపదికన కూడా ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. 2025 డిసెంబర్లో అమ్ముడైన 14,944 యూనిట్లతో పోలిస్తే 2026 జనవరిలో 23.59 శాతం పెరుగుదల నమోదైంది. సాధారణంగా కొత్త సంవత్సరం ప్రారంభంలో అమ్మకాలు కొంత స్థిరంగా ఉండే అవకాశమున్నా, ఈసారి మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ మరింత పెరగడం గమనార్హం. మొత్తంగా, 2026 ప్రారంభం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్కు కీలక మలుపుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగం వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, అగ్రస్థానాన్ని మరొక్కసారి దక్కించుకున్న సంస్థ Tata Motors. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా నిలిచిన టాటా, 2026 జనవరిలో మొత్తం 8,007 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం జనవరి 2025లో అమ్ముడైన 5,313 యూనిట్లతో పోలిస్తే 50.71 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసినట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి.

రెండవ స్థానంలో నిలిచిన సంస్థ JSW MG Motor. ముఖ్యంగా 'విండ్సర్' ఎలక్ట్రిక్ కారు మంచి ఆదరణ పొందడంతో, 2026 జనవరిలో మొత్తం 4,703 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 4,530 యూనిట్లు విక్రయించగా, ఈసారి 3.82 శాతం వార్షిక వృద్ధి సాధించింది. మూడవ స్థానాన్ని Mahindra & Mahindra కైవసం చేసుకుంది. 2026 జనవరిలో మహీంద్రా మొత్తం 3,668 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, జనవరి 2025లో మహీంద్రా కేవలం 740 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఈ నేపథ్యంలో 395.68 శాతం వార్షిక వృద్ధి సాధించడం విశేషం. అంతేకాకుండా నెలవారీ ప్రాతిపదికన కూడా 18.98 శాతం పెరుగుదల నమోదు కావడం మహీంద్రా ఎలక్ట్రిక్ వ్యూహం ఫలిస్తున్నదని సూచిస్తోంది. ఇక భారత మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టిన వియత్నాం సంస్థ VinFast కూడా వేగంగా తన స్థానం సంపాదించుకుంటోంది.

2026 జనవరిలో 435 ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలతో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. కొత్త బ్రాండ్ అయినప్పటికీ, ప్రారంభ దశలోనే మంచి స్పందన పొందడం గమనార్హం. మరోవైపు ఐదో స్థానంలో హ్యూందాయ్ మోటార్స్ జనవరిలో 333 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించింది. ఇది 2025 జనవరిలో నమోదైన 331 యూనిట్లతో పోలిస్తే స్వల్ప పెరుగుదల మాత్రమే. అంటే ఈ విభాగంలో హ్యుందాయ్ ఇంకా పెద్ద దూకుడు సాధించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








