కోల్పోయిన సింహాసనం కోసం పోరాటం.. 4 బ్రహ్మాస్త్రాలను దింపుతుంది! టాటా, మహీంద్రాలకు టెన్షన్ స్టార్ట్!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న హ్యుందాయ్ ప్రస్తుతం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి కంపెనీలు వేగంగా దూసుకెళ్తుండటంతో హ్యుందాయ్ తన పాత స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సవాల్ను అవకాశంగా మార్చుకుని మళ్లీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని కొరియన్ దిగ్గజం గట్టి వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ లక్ష్యంతోనే 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త వాహనాలను విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కొత్త మోడళ్లు, అప్డేటెడ్ వెర్షన్లు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాహనాల ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని సంస్థ భావిస్తోంది.
ఈ భారీ ప్రణాళికలో భాగంగా 2027 నాటికే నాలుగు సరికొత్త మోడళ్లను తీసుకురావాలని హ్యుందాయ్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ప్రకారం, ఈ నాలుగు మోడళ్లలో మూడు ఎస్యూవీలు కాగా, ఒకటి ప్రీమియం హ్యాచ్బ్యాక్గా ఉండనుంది. పెరుగుతున్న ఎస్యూవీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తుల శ్రేణిని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టబోయే ఆ కొత్త హ్యుందాయ్ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyundai i20: నాలుగో తరం i20ను ఈ ఏడాది చివరి నాటికి గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించే అవకాశం ఉంది. అనంతరం 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో కూడా దీనిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త తరం i20 పూర్తిగా రీడిజైన్ చేసిన ఎక్స్టీరియర్తో మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. ఆధునిక డిజైన్ అంశాలు, షార్ప్ స్టైలింగ్ ఎలిమెంట్స్తో ఇది యువతను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. క్యాబిన్లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి.
డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఒకే కర్వ్డ్ ప్యానెల్లో అమర్చవచ్చు, దీంతో ఇంటీరియర్ మరింత ప్రీమియం ఫీల్ను అందించనుంది. భద్రత విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్లతో పాటు మరిన్ని Level-2 ADAS టెక్నాలజీలను జోడించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ కొత్త i20ను హ్యుందాయ్ గ్లోబల్ క్రాస్ఓవర్ మోడల్ Bayon ఉపయోగిస్తున్న ప్లాట్ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

Hyundai Creta: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUVలలో ఒకటైన Hyundai Creta కొత్త తరం మోడల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్తో పోలిస్తే ఇది మరింత పెద్ద సైజుతో రానుందని సమాచారం. కొత్త Creta హ్యుందాయ్ K3 ప్లాట్ఫామ్పై రూపొందించబడనుంది. అలాగే, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆధారిత హైబ్రిడ్ పవర్ట్రెయిన్ను కూడా ఈ SUVలో అందించే అవకాశం ఉంది.
Bayon: హ్యుందాయ్ ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో విక్రయిస్తున్న బేయాన్ క్రాస్ఓవర్ SUV త్వరలో కొత్త తరం అవతారంలో రానుంది. ఈ మోడల్ను భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, వచ్చే ఏడాది నాటికి Bayon భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్ పరంగా కొత్త బేయాన్ మరింత స్టైలిష్గా, యువతను ఆకట్టుకునే లుక్తో రానుందని తెలుస్తోంది.

కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV: టాటా పంచ్ EVకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో హ్యుందాయ్ కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ SUV, అందుబాటు ధరలో అధునాతన ఫీచర్లను అందించే అవకాశం ఉంది. బ్యాటరీ విషయంలో ఎక్సైడ్ ఎనర్జీ భారత్లో తయారు చేసే LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications